Chittoor Fire Accident: చిత్తూరు జిల్లాలో విషాదం.. పేపర్ ప్లేట్ల యూనిట్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
Chittoor Fire Accident: చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన చిత్తూరులోని రంగాచారి వీధిలో చోటు చేసుకుంది. మృతుల్లో పరిశ్రమ యజమాని భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీ బాబు ఉన్నారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది.
Ant Population On Earth: భూమిపై ఎన్ని చీమలు ఉన్నాయో తెలుసా..? పరిశోధకులు ఎలా లెక్కించారంటే..
చిత్తూరులోని రంగాచారీ వీధిలో రెండంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్లో పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్ నిర్వహిస్తున్నారు. రెండో అంతస్తులో వారు నివసిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత పేపర్ ప్లేట్స్ తయారీ యూనిట్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి రెండో అంతస్తుకు కూడా అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో.. తండ్రీ కొడుకు భాస్కర్(65), డిల్లీ బాబు (35)తో పాటు మరోవ్యక్తి బాలాజీ (25)గా గుర్తించారు.
Aadhaar Photo Update : మీ ఆధార్ కార్డ్లో ఫొటో ఎలా అప్డేట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
ఈ ఘటనతో చిత్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. భాస్కర్ కుమారుడు ఢిల్లీబాబు పుట్టిన రోజు వేడుకలు మంగళవారమే జరిగాయి. మంటలు వ్యాపించిన సమయంలో ఇంట్లో ముగ్గురే ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.