Nellore Shooting : నెల్లూరు కాల్పుల ఘటనలో మరో ట్విస్ట్
వెంటాడి వేధించి కావ్యను కాల్చి చంపి అదే తుపాకితో తాను కూడా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని ఉన్మాదానికి కావ్య బలి అయిపోయింది.
Nellore shooting incident : నెల్లూరు కాల్పుల ఘటనలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. గత ఏడాదే కావ్యారెడ్డి హత్యకు సురేశ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో సురేశ్ రెడ్డి పర్యటించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసు బృందాలు ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. కావ్యరెడ్డిని సురేశ్రెడ్డి రెండేళ్లుగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని కావ్యరెడ్డి సోదరుడు మదన్రెడ్డి అన్నారు. నిత్యం ఫోన్లు, మెసేజ్లు చేసి వేధించేవాడని.. అతని నంబర్ను కావ్య బ్లాక్ చేసినప్పటికీ వేధింపులు ఆపలేదని వాపోయారు. అయితే మొదటి నుంచి కావ్యరెడ్డి సురేశ్ రెడ్డిని పెళ్లి చేసుకోను అని చెప్పిందని మదన్రెడ్డి తెలిపారు. సురేశ్కు పలుమార్లు చెప్పినా వేధింపులు ఆపలేదన్నారు. కావ్యరెడ్డితో మాట్లాడేందుకు సురేశ్ 78 సిమ్లు ఉపయోగించాడని తెలిపారు.
కావ్య కాల్పుల ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సురేశ్ రెడ్డి వేధింపులు భరించలేక కావ్య అతని నంబర్ ని బ్లాక్ చేసింది. దీంతో సురేశ్ రెడ్డి పదే పదే సిమ్ లు మార్చి వెంటాడి వేధించాడు. కేవలం కావ్యను వేధించటానికే సురేశ్ రెడ్డి రెండు కాదు మూడు కాదు ఏకంగా 78 సిమ్ కార్డులు మార్చి వేధింపులకు పాల్పడ్డాడు. అలా వెంటాడి, వేధించి చివరకు అతని ఉన్మాదానికి కావ్య ప్రాణాల్ని బలితీసుకున్నాడు. తుపాకితో కాల్చి కావ్య ప్రాణాలు తీశాడు. రెండేళ్ల క్రితం తాటిపర్తి జాతరలో కావ్యను చూసిన సురేశ్ రెడ్డి ఆమెను ఇష్టపడ్డాడు. కానీ కావ్యకు ఇష్టం లేదని చెప్పినా సరే సురేశ్ రెడ్డి కావ్య వెంటపడటం మానలేదు. అలా వెంటాడి వేధించి కావ్యను కాల్చి చంపి అదే తుపాకితో తాను కూడా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని ఉన్మాదానికి కావ్య బలి అయిపోయింది.
Nellore : యువతిని తుపాకీతో కాల్చి చంపిన ప్రేమోన్మాది
నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో దారుణం ఘటన వివరాల్లోకి వెళితే..పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన సురేశ్రెడ్డి, కావ్య సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. సురేశ్ రెడ్డి బెంగళూరులో, కావ్య ముంబాయిలో పనిచేస్తున్నారు.ప్రస్తుతం వర్క్ఫ్రమ్ హోం నడుస్తుండడంతో.. వీరిద్దరూ తమ స్వగ్రామమైన తాటిపర్తి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కొంతకాలంగా.. ప్రేమ పేరుతో సురేశ్ కావ్య వెంటపడ్డాడు. రెండేళ్ల క్రితం కావ్యను తాటిపర్తి జాతరలో చూసిన సురేశ్ రెడ్డి మనస్సు పారేసుకున్నాడు. కానీ కావ్య మాత్రం సురేశ్ ను ఇష్టపడలేదు. కానీ సురేశ్ మాత్రం నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను అంటుండేవాడు.
అలా కావ్యను పెళ్లి చేసుకునేందుకు తమ ఇంటి నుంచి పెద్దలను.. కావ్య ఇంటికి పంపించినట్టు సమాచారం. అయితే.. వీరి పెళ్లికి కావ్య కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో.. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో.. సురేశ్ కావ్య ఇంటికి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం తానూ తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న కావ్యను స్థానికులు హుటాహుటిన నెల్లూరు ఆస్పత్రికి తరలించగా.. మార్గంమధ్యలోనే ఆమె మృతి చెందింది.