చంద్రబాబులా ఆర్భాటాలు వద్దు.. పార్టీని పటిష్టం చేయాలి: విజయసాయి రెడ్డి

  • Published By: Subhan ,Published On : June 3, 2020 / 02:41 PM IST
చంద్రబాబులా ఆర్భాటాలు వద్దు.. పార్టీని పటిష్టం చేయాలి: విజయసాయి రెడ్డి

వైసీపీ పెద్దలు పార్టీ పటిష్టతపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వం చేసిన పనులు ప్రజల్లోకి తీసుకెళితే తిరుగుండదని అన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. తాడేపల్లి కార్యాలయం వేదికగా వీడియో కాన్ఫిరెన్స్ లో నేతలతో మాట్లాడారు. 

ఏడాదిగా చేసిన పాలనను ప్రజల్లోకి పూర్తి స్థాయిలోకి తీసుకెళ్లాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది. పార్టీ యాక్టివిటీలు  రెగ్యూలర్‌గా ఉండాలి. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పెద్ద ఎత్తున నిర్వహించిన సంక్షేమాల ప్రచారాన్ని మాత్రమే చెప్పాలి. 

లేనిపోని ప్రచారాలు చేసి గత ప్రభుత్వం మాదిరిగా ఆర్భాటాలతో కూడిన ప్రచారం చేయొద్దని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబులా తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ పార్టీ నేతలతో అన్నారు.