Electric Car : సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు..ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 520 కి.మీ ప్రయాణం

వాహన తయారీ రంగంలో ఉన్న బీవైడీ.. ‘ఈ6’ పేరుతో కొత్త ప్రీమియం ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ మల్టీ పర్పస్‌ వెహికిల్‌ను ఆవిష్కరించింది. ఇండియా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని తయారు చేసింది.

Electric Car : సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు..ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 520 కి.మీ ప్రయాణం

Car

BYD India e6 EV MPV : వాహన తయారీ రంగంలో ఉన్న బీవైడీ.. ‘ఈ6’ పేరుతో సరికొత్త ప్రీమియం ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ మల్టీ పర్పస్‌ వెహికిల్‌ను ఆవిష్కరించింది. ఇండియా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని తయారు చేసింది. వీటి ధర ఎక్స్‌షోరూంలో రూ.29.6 లక్షలుగా ఉంది. ఈ మల్టీ పర్పస్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌లో 71.7 కిలోవాట్‌ అవర్‌ లిథియం ఐరన్‌ పాస్పేట్‌ బ్లేడ్‌ బ్యాటరీ పొందుపరిచారు.

ఈ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 520 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 180 ఎన్‌ఎం టార్క్, గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు, 580 లీటర్ల బూట్‌ స్పేస్, వంటి హంగులు ఉన్నాయి.

Corona Cases : దేశంలో కొత్తగా 10,423 కరోనా కేసులు, 443 మరణాలు

వాహనం వారంటీ మూడేళ్లు లేదా 1,25,000 కిలోమీటర్లు, బ్యాటరీ 8 ఏళ్లు లేదా 5,00,000 కిలోమీటర్లు, ట్రాక్షన్‌ మోటార్‌ 8 ఏళ్లు లేదా 1,50,000 కిలోమీటర్లు ఆఫర్‌ చేస్తోంది.