స్నేహితుల బలవంతంతో లాటరీ టికెట్ కొన్నాడు. కోటి రూపాయల బంపర్ ప్రైజ్ కొట్టేశాడు
mandya man wins one crore kerala lottery : కర్ణాటకలోని మండ్యా కుచెందిన సోహన్ బలరాం పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారు మోగిపోతోంది. అదృష్టమంటే అతనిదే అని అందరూ తెగ పోగిడేస్తున్నారు. కేరళ వెళ్లి నక్కను తొక్కి వచ్చాడని అంటున్నారు, కారణం ఏమిటంటే కేరళలో ఉన్న తన ఫేస్ బుక్ స్నేహితుడిని వెళ్లి వచ్చేటపుడు లాటరీ టికెట్ కొన్నాడు. దానికి కోటి రూపాయలు బంపర్ బహుమతి తగిలింది.
కర్ణాటక మండ్యా జిల్లా, మద్దూరు తాలూకాలోని సోమనహళ్లికి చెందిన సోహన్ బలరాం, తన ఫేస్ బుక్ స్నేహితుడు పరవన్నూర్ కైపాలక్కల్ ప్రభాకరన్ ను కలవటానికి శనివారం కేరళలోని మలప్పురం,పుత్తనథని వెళ్లాడు. అక్కడ తన స్నేహితుడిని కలిసి, అతడి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశాడు.
పుతనాథని లోని బలరాం స్నేహితుడు స్ధానికంగా భాగ్యమిత్ర లాటరీ టికెట్ల ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. తిరిగి సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా స్నేహితుల బలవంతం మీద 100 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాడు. మండ్యా జిల్లాకు తిరుగుపయనమయ్యాడు. మార్గమధ్యలో ఉండగా అతనుకొన్న లాటరీ టికెట్ కు రూ. కోటి రూపాయలు బంపర్ ప్రైజ్ తగిలినట్లు తెలియటంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.
దీంతో తన మండ్యా ప్రయాణాన్నివాయిదా వేసుకుని తిరిగి పుత్తనథని వెళ్ళాడు. కేరళలోని భాగ్యమిత్ర లాటరీ ప్రతినెల మొదటి ఆదివారం డ్రా తీస్తారు. అందులో మొదటి బహుమతి కోటి రూపాయలు కాగా రెండవ బహుమతి రూ.10 లక్షలు, మూడవ బహుమతి ఎనిమిది మందికి రూ. 2లక్షలు చొప్పున ఇతర కన్సోలేషన్ బహుమతులు ఉన్నాయి. కోటి రూపాయలు గెలుచుకున్న తన మిత్రుడికి ప్రభాకరన్ అతని మిత్రులు ఘన స్వాగతం పలికారు.