MIcrosoft Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పెట్టుబడులతో Groww

ఇండియాకు చెందిన ఆన్ లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్ ఫాం అయిన గ్రో సంస్థలోకి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అడుగుపెట్టారు. ఈ మేరకు Groww ఫౌండర్ లలిత్ కేశ్రే ట్విట్టర్ లో...

MIcrosoft Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పెట్టుబడులతో Groww

Satya Nedlla

MIcrosoft Satya Nadella: ఇండియాకు చెందిన ఆన్ లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్ ఫాం అయిన గ్రో సంస్థలోకి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అడుగుపెట్టారు. ఈ మేరకు Groww ఫౌండర్ లలిత్ కేశ్రే ట్విట్టర్ లో ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టు పెట్టారు.

“ప్రపంచంలోనే బెస్ట్ సీఈఓ అయిన సత్య నాదెళ్ల పెట్టుబడులు దక్కించుకుంది Groww. సత్య నాదెళ్ల జాయిన్ అవడం సంతోషంగా ఉంది. ఇండియాలో మా ఫైనాన్షియల్ సర్వీసులు విస్తరించడమే మా మిషన్” అంటూ ట్వీట్ చేశారు లలిత్..

ఫ్లిప్ కార్ట్ మాజీ ఉద్యోగులైన కేశ్రే, హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సాల్ లు 2016లో ఈ సర్వీసును లాంచ్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్లు వెబ్ లేదా మొబైల్ నుంచి యాక్సెస్ చేయడానికి అనుకూలంగా దీనిని రూపొందించారు..

ఇది కూడా చదవండి : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

2021 అక్టోబర్ నాటికి గ్రో 251మిలియన్ డాలర్లు వృద్ధి చెందింది. సత్య నాదెళ్ల నుంచే కాకుండా ఆల్కియోన్, లోనె పైన్ క్యాపిటల్, స్టడ్ ఫాస్ట్ వారి నుంచి పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. ఈ స్టార్టప్ కు ఇతర ఇన్వెస్టర్లు అయిన రిబ్బిట్ క్యాపిటల్, సీక్వియా వై కాంబినేటర్, టైగర్ గ్లోబల్, ప్రోపెల్ వెంచర్ పార్టనర్స్, ఐకానిక్ గ్రోత్, ఆల్కియోన్, లోనె పైన్ క్యాపిటల్, స్టడ్ ఫాస్ట్ కూడా ఇందులో ఇన్వెస్టర్లుగా ఉన్నారు.