India Stock Market : ఉక్రెయిన్ -రష్యా ఎఫెక్ట్, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భారత్ పై ప్రభావం చూపెడుతోంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్లపై ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతుండడంతో...

India Stock Market : ఉక్రెయిన్ -రష్యా ఎఫెక్ట్, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market

Sensex – Nifty : ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భారత్ పై ప్రభావం చూపెడుతోంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్లపై ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. గత కొన్ని రోజులుగా భారీ నష్టాలు చవి చూస్తున్న మార్కెట్… 2022, ఫిబ్రవరి 21వ తేదీ సోమవారం అదే బాటలో పయనించింది. శుక్రవారం భారీ నష్టాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ఆసియా మార్కెట్లు సోమవారం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ముడి చమురు ధరలు, FIIల అమ్మకాలు సాగుతాయని, F&O కాంట్రాక్టుల గడువు తీరనుండడం ఈ వారం ట్రేడింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Read More : Indian Market : రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ మేఘాలు.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

సోమవారం ఉదయం సెన్సెక్స్ 587 పాయింట్ల నష్టంతో 57 వేల 245 వద్ద, నిఫ్టీ 181 పాయింట్లు నష్టపోయి 17 వేల 095 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 74.59 వద్ద ట్రేడవుతోంది. పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, ఎన్ టీపీసీ, టీసీఎస్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టాల బాట పయనిస్తున్నాయి. ఇక రష్యా – ఉక్రెయిన్ విషయానికి వస్తే… యుద్ధం ఏ క్షణమైనా వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుతిన్ తో అమెరికా అధ్యక్షులు బైడెన్ చర్చలు జరుపుతారని, ఈనెల 24వ తేదీన అమెరికా – రష్యా విదేశాంగ మంత్రుల భేటీ ఉంటుందనే వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం లభిస్తుందనే అంచనాలు వేసుకుంటున్నారు. అయితే.. ఈ వివాదంపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం కనిపిస్తోంది.