Terrorists Encounter: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు

బుద్గామ్ లోని జోల్వా క్రాల్పోరా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతాదళాలు సోదాలు చేపట్టాయి. ఈక్రమంలో భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు

Terrorists Encounter: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు

Police

Terrorists Encounter: జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. భారత భద్రతాదళాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ లోని బుద్గామ్ ప్రాంతంలో భద్రతాదళాలు ఉగ్రవాదులకు మధ్య గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గామ్ లోని జోల్వా క్రాల్పోరా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతాదళాలు సోదాలు చేపట్టాయి. ఈక్రమంలో భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

Also read: Jawed Habib: మహిళ జుట్టుపై ఉమ్మిన ఘటనపై క్షమాపణలు చెప్పిన జావేద్

ఉగ్రవాదుల చర్యను తిప్పికొట్టిన భద్రతాదళాలు.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అనంతరం జరిపిన సోదాల్లో భారీగా ఆయుధ సామగ్రి పట్టుబడినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు ఉపయోగించిన ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ లో మృతి చెందిన ముగ్గురు ఉగ్రవాదుల వివరాలు సేకరిస్తున్న అధికారులు..వీరి సహచరుల కోసం గాలిస్తున్నారు. ఎన్కౌంటర్ కు సంబంధించి కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

Also read: Dog saves Owner: కిడ్నాప్ నుంచి యజమానిని రక్షించిన శునకం