Uttar Pradesh: బీఎండబ్ల్యూ కారు, ట్రక్కు ఢీ.. నలుగురు మృతి

బీఎండబ్ల్యూ కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Uttar Pradesh: బీఎండబ్ల్యూ కారు, ట్రక్కు ఢీ.. నలుగురు మృతి

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. సుల్తాన్ పూర్ పరిధిలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై శుక్రవారం ఈ ఘటన జరిగింది. సుల్తాన్ పూర్ నుంచి వెళ్తున్న బీఎండబ్ల్యూ కారును ఎదురుగా వచ్చిన కంటైనర్ ట్రక్కు వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది.

Parathas: పరాటాలపై 18 శాతం జీఎస్టీ.. బ్రిటీష్ వాళ్లు కూడా పన్ను వేయలేదన్న కేజ్రీవాల్

కారు పూర్తిగా ధ్వంసం కావడంతోపాటు, కారులో ప్రయాణిస్తున్న నలుగురు దూరంగా ఎగిరిపడ్డారు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మరణించారు. ఘటన సమాచారం అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ ప్రమాద స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. మృతులను బిహార్‌కు చెందిన ఆనంద్ ప్రకాశ్ (35), అఖిలేష్ సింగ్ (35), దీపక్ కుమార్ (37)గా గుర్తించారు. మరో మృతుడిని గుర్తించాల్సి ఉంది. కాగా, గత వారం కూడా ఇదే రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై 15 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు ఉన్న గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యిలో ఒక కారు చిక్కుకుపోయింది.