Abdullapurmet Incident : అమ్మాయి కోసం స్నేహితుడి హత్య కేసు.. చంచల్‌గూడ జైలుకి నిందితుడు

అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. నిందితుడు హరిహర కృష్ణను హయత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడిని చంచల్ గూడ జైలుకి తరలించారు పోలీసులు.(Abdullapurmet Incident)

Abdullapurmet Incident : అమ్మాయి కోసం స్నేహితుడి హత్య కేసు.. చంచల్‌గూడ జైలుకి నిందితుడు

Abdullapurmet Incident : అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. నిందితుడు హరిహర కృష్ణను హయత్ నగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడిని చంచల్ గూడ జైలుకి తరలించారు పోలీసులు. ప్రేమ వ్యవహారంలో తన స్నేహితుడు నవీన్ ని హరి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను వేరు చేయడం, వాటిని ఫొటోలు తీసి ప్రేమించిన అమ్మాయికి పంపడం సంచలన రేపింది. చదువుకునే కుర్రాడి విపరీత ప్రవర్తన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

ఈ హత్య కేసులో పోలీసులు హరిని విచారిస్తున్నారు. నిందితుడు మూసారాంబాగ్ లోని తన అక్క బావలతో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 23న హరి ఇంటికి రాలేదు. దీంతో అక్కడ, బావ, మరదలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజే హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరుపుతున్నారు.

నవీన్ ను హత్య చేయడమే కాదు అతడి శరీర భాగాలను బయటకు తీసి వాటిని సెల్ఫీ వీడియో తీసి ప్రేమించిన అమ్మాయికి హరి పంపడం షాక్ కి గురి చేసింది. దీనికి సంబంధించి పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. మర్డర్ కేసు ఇప్పటికే నమోదు చేశారు. అతడిని రిమాండ్ లో తీసుకుని మరోసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. హరిహరకృష్ణ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడా? లేక ఎవరైనా నిందితుడికి సహకరించారా? అనే కోణంలో దర్యాఫ్తు కొనసాగుతోంది.

Also Read..Abdullapurmet Incident : హత్య చేసి మర్మాంగాన్ని కోసి.. నవీన్ మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

కేవలం తన ప్రియురాలు తనకి దక్కకుండా పోతుందనే అనుమానంతో తన స్నేహితుడినే.. హరి అత్యంత కిరాతకంగా చంపాడు. మర్డర్ చేయడమే కాకుండా అతడి శరీర భాగాలను బయటకు తీసి ఫొటోలు తీయడం అంటే.. హరిహర కృష్ణది ఎంత క్రూయల్ మైండ్ అన్నది అర్థమవుతుందని పోలీసులు అంటున్నాడు. వాడు మనిషి కాదు సైకో అని అంటున్నారు. రేపు లేదా ఎల్లుండి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కచ్చితంగా నిందితుడిని కస్టడీలోకి తీసుకుని మరోసారి విచారించే అవకాశం ఉంది. ఈ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.

ప్రేమ వ్యవహారం దారుణానికి దారితీసింది. ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడినే చంపేశాడు. అంతేకాదు శరీర భాగాలను వేరు చేసి ఫొటోలు కూడా తీశాడు. తాను ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్నాడన్న కోపంతో అతడీ దారుణానికి ఒడిగట్టాడు.

Also Read..Abdullapurmet Love Affair : ఫ్రెండ్‌ను చంపి గుండె తీసి ఫొటో పంపిన సైకో.. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉన్నాడని దారుణం

నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్‌ కాలేజీలో.. నాగర్‌కర్నూల్‌ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్‌ నవీన్‌(20) బీటెక్‌ ఫైనలియర్(ఈఈఈ) చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న హరిహర కృష్ణతో నవీన్‌కు స్నేహం ఉంది. అయితే, ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. అదే దారుణానికి దారితీసింది.(Abdullapurmet Incident)

అమ్మాయి ప్రేమ విషయంలో వారి మధ్య విబేధాలు మొదలయ్యాయి. అది కేవలం గొడవల వరకే కాదు.. ఏకంగా మర్డర్ వరకు వెళ్లింది. నవీన్ వల్ల ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమోనని భావించిన హరి.. స్నేహితుడు నవీన్ ను కిరాతకంగా చంపేశాడు.

తాను ప్రేమించిన యువతితో తన స్నేహితుడు నవీన్ సన్నిహితంగా ఉండటం చూసి కృష్ణ ఓర్వలేకపోయాడు. తనకు సొంతం అనుకున్న అమ్మాయి.. మరో వ్యక్తితో మాట్లాడటం ఆ యువకుడికి నచ్చలేదు. దీంతో తన స్నేహితుడిని ఎలాగైనా చంపి.. ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. క్లోజ్ ఫ్రెండ్ అని చూడకుండా.. దారుణంగా హత్య చేశాడు. వారం రోజుల తర్వాత పోలీసుల ముందు లొంగిపోయాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పార్టీ చేసుకుందాం అని ఈ నెల 17న నవీన్‌ను.. అబ్దుల్లాపూర్‌మెట్‌‌లో తన స్నేహితుడి రూమ్‌కు ఆహ్వానించాడు హరి. ఇద్దరు పార్టీ చేసుకుంటున్న సమయంలో అమ్మాయి గురించి గొడవ జరిగింది. వెంటనే నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్‌ చేసి గొడవ గురించి చెప్పాడు. శంకరయ్య హరితో మాట్లాడటంతో అంతటితో గొడవ ఆగింది. ఇంతలో నవీన్ నాలుగు రోజులుగా కాలేజీకి వెళ్లడం లేదని తండ్రి శంకరయ్యకు తెలిసింది.

దాంతో నవీన్ తండ్రి శంకరయ్యకు అనుమానం పెరిగింది. ఈ నెల 22న శంకరయ్య నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంజీయూలో విద్యార్థులను, హరి స్నేహితులతో మాట్లాడారు. హరి ఫోన్‌ ఈ నెల 22న సాయంత్రం నుంచి స్విఛ్చాఫ్‌ రావడంతో.. అతడి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించారు. హరి గురించి ఆరా తీశారు.. అతడి గురించి వివరాలు తెలియలేదు.

ఇంతలో శుక్రవారం(ఫిబ్రవరి 24) రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్‌లో హరి లొంగిపోయాడు. అమ్మాయి విషయంలో గొడవ జరిగిందని, ఆమె తనకు దక్కదని భావించి నవీన్‌ను కొట్టి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని అబ్దుల్లాపూర్‌మెట్‌ శివారులోని హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పడేసినట్లు చెప్పాడు.

గుండెను బయటకు తీసి.. మర్మాంగాన్ని కూడా కోసి
ఈ హత్య కేసు విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. హరిహర కృష్ణ ఒక సైకో అంటున్నారు పోలీసులు. నవీన్‌ ను కిరాతకంగా హత్య చేశాక ఈ విషయాన్ని ప్రేమించిన అమ్మాయికి ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయికి పంపిన మేసేజ్ దారుణంగా ఉంది. ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు అంటూ నవీన్ వేలును కోసి ఆ ఫొటో అమ్మాయికి పంపాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది.. అంటూ పెదాలు కోసేశాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది.. అంటూ నవీన్‌ గుండెను బయటకు తీసి ఆ ఫొటోను కూడా పంపించాడు. చివరకు నవీన్ తలను కోసి దూరంగా పడేశాడు. ఆ తర్వాత నవీన్ మర్మాంగాన్ని కూడా కోసేశాడు.