Bihar minister : నా ప్రాణాలకు ముప్పు ఉంది…పోలీసులకు ఫిర్యాదు చేసిన బీహార్ మంత్రి

తన ప్రాణాలకు ముప్పు ఉందని బీహార్ రాష్ట్ర సహకారశాఖ మంత్రి సురేంద్ర ప్రసాద్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని మంత్రి పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు....

Bihar minister : నా ప్రాణాలకు ముప్పు ఉంది…పోలీసులకు ఫిర్యాదు చేసిన బీహార్ మంత్రి

Bihar minister

Bihar minister : తన ప్రాణాలకు ముప్పు ఉందని బీహార్ రాష్ట్ర సహకారశాఖ మంత్రి సురేంద్ర ప్రసాద్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని మంత్రి పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘నా ప్రాణాలకు ముప్పు ఉంది. నన్ను చంపే అవకాశం ఉంది. నన్ను చంపాలనుకునే వ్యక్తులు నాకు తెలుసు. నన్ను చంపినందుకు నిందితుడు రూ.11 కోట్ల రివార్డును ప్రకటించాడు’’ అని మంత్రి సురేంద్ర ప్రసాద్ యాదవ్ పోలీసులకు లేఖ రాశారు.(he might be killed over caste issues) తనను చంపినందుకు రూ.11కోట్ల రివార్డు ప్రకటించారని, కుల సమస్యలతోనే తనను బెదిరిస్తున్నారని మంత్రి చెప్పారు.

PM Modi Tiffin Pe Charcha : వరణాసిలో బీజేపీ కార్యకర్తలతో మోదీ టిఫిన్ పే చర్చా సమావేశం

కాంట్రాక్టు కిల్లర్స్ సహాయంతో నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. పోలీసులు నిందితుడిని గుర్తించారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. తన హత్య బెదిరింపులో కుల కోణం ఉందని, నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోనివ్వండని మంత్రి చెప్పారు. తనను హతమారుస్తామని బెదిరించిన వారి గుర్తింపును వెల్లడించడానికి మంత్రి నిరాకరించారు.