Hyderabad Gang Rape : గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐతో గానీ..లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : రఘునందన్ రావు

హైదకాబాద్ లోని జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి..లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

Hyderabad Gang Rape : గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐతో గానీ..లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : రఘునందన్ రావు

Hyderabad Jubliee Hills Gang Rape

Hyderabad jubliee hills Gang Rape : హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి..లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని తెలంగాణ బీజేపీ నేత..ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ రేప్ ఘటనకు సంబంధించి వీడియోలు..ఫోటోలు మా దగ్గర ఉన్నాయంటూ ఫోటోలను విడుదల చేశారు. రెడ్ కలర్ కారులో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని చెబుతున్నారు రఘునందన్ రావు. ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంటే కారులో ఎమ్మెల్యే కొడుకు లేడని పోలీసులు చెబుతున్నారని..ఇదంతా సదరు ఎమ్మెల్యే కొడుకుని కాపాడటానికి పోలీసులు నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. హైదరాబాద్ లో పోలీసులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కంట్రోల్ లో లేరని రాజకార్ల వారసులు చెప్పినట్లుగా పోలీసు కమిషనర్లు వింటున్నారంటూ ఎద్దేవా చేశారు. రేప్ ఘటనపై పోలీసులు లీకులు ఇచ్చారు తప్ప నిందితులను అరెస్ట్ చేయలేదని అన్నారు.బెంజ్ కారులో ఉన్నవారిని వదిలేసి.. ఇన్నోవా కారులో ఉన్నవారిని మాత్రమే ముద్దాయిలుగా చూపు అసలైనవారిని తప్పించటానికి చూస్తున్నారంటూ మండిపడ్డారు బీజేపీ నేత రఘునందన్ రావు.

కాగా..హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ ఘటనలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు ఉన్నారనే విషయం రాజకీయ పరంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆధారాలే లభించలేదని పోలీసులు చెపుతున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కొన్ని ఆధారాలను మీడియా ముఖంగా బయటపెట్టారు. అమ్నేషియా పబ్ కు బెంజ్ కారులో ఉన్న ఎమ్మెల్యే కొడుకు, కారులో సదరు అమ్మాయితో అసభ్యంగా వ్యవహరిస్తున్న ఫొటోలను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ..ప్రశ్నించినవారిని పోలీసులు భయపెట్టేలా వ్యవహరిస్తున్నారనీ..పోలీసుల బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరని అన్నారు. మమ్మల్ని భయపెట్టడం మానేసి, తప్పులు చేసిన వారిని భయపెట్టండి అంటూ ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే కేసులు పెడతామని పోలీసులు అన్నారని… ఘటనకు తగిన అన్ని ఈ ఆధారాలన్నీ చూపిస్తున్నానని..అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు ఎందుకు సీక్రెట్ గా దాస్తున్నారని ప్రశ్నించారు. నిందితులను ఇప్పటికే దేశం దాటించేసి ఉంటారని ఆరోపించారు. నిందితులు మేజరా, లేక మైనరా అనే విషయం అనవసరం కానీ చేసింది చాలా పెద్ద నేరం..నేరం చేసినవారు శిక్ష అనుభవించి తీరాలని అన్నారు. నిర్భయ కేసులో కూడా మైనర్ల పేర్లు బయటకు వచ్చాయని… ఇక్కడ మన పోలీసులు నిందితుల పేర్లను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు.