R.Krishnaiah : ఆర్.కృష్ణయ్యపై హెచ్చార్సీలో ఫిర్యాదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు.

R.Krishnaiah : ఆర్.కృష్ణయ్యపై హెచ్చార్సీలో ఫిర్యాదు

R.krishnaiah

R.Krishnaiah : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ పేరు చెప్పి తనను బెదిరిస్తున్నాడని… అతనికి ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇచ్చినా కూడా 4 బాండ్ పేపర్లు తిరిగి ఇవ్వట్లేదని రవీందర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కోన్నారు.

తన బాండ్ పేపర్లు తిరిగి ఇవ్వమని అడిగినందుకు తనను చంపుతానని   బెదిరిస్తున్నారని రవీందర్ రెడ్డి పేర్కోన్నారు. ఆర్.కృష్ణయ్య తో పాటు, రామకోటి, రామమూర్తి, రాజేందర్, నీలం వెంకటేష్,  అంజి,  శ్రీనివాస్,  అనంతయ్యలు  చంపుతామని, కిడ్నాప్ చేస్తామని బెదిరించినట్లు రవీందర్ రెడ్డి పిర్యాదులో తెలిపారు. ఇప్పటికే ఆర్.కృష్ణయ్యపై ఐపీసీ సెక్షన్ 447,427,506,384 కింద కేసులు నమోదు అయ్యాయి.

Also Read : Brandix : బ్రాండిక్స్ లో మరోసారి గ్యాస్ లీక్…పరుగులు పెట్టిన సెక్యూరిటీ సిబ్బంది