Tragedy : రంగారెడ్డి జిల్లాలో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్, హత్య
రంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. మైలార్ దేవ్ పల్లిలోని శ్రీరామ్ నగర్ లోని కాలనీలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల బాలుడు హత్య గావించబడ్డాడు.
boy killed in Rangareddy : రంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. మైలార్ దేవ్ పల్లిలోని శ్రీరామ్ నగర్ లోని కాలనీలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల బాలుడు హత్య గావించబడ్డాడు. లక్ష్మీనరసింహ అనే బాలుడిని ఇవాళ ఉదయం అతని బాబాయి వీరేశ్ తీసుకెళ్లాడు.
సాయంత్రం నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కుటుంబ కక్షలతో బాలుడిని అతని బాబాయి వీరేశ్ చంపనట్లు అనుమానిస్తున్నారు.
AP Govt : ఏపీలో వరదల బీభత్సంపై ప్రభుత్వం ప్రకటన
బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.