అనుమానంతో భార్య కాళ్లు, చేతులు నరికేసిన భర్త

చిత్తూరులో జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ భర్త.. భార్య కాళ్లు, చేతులు నరికేశాడు.

  • Published By: veegamteam ,Published On : November 24, 2019 / 07:13 AM IST
అనుమానంతో భార్య కాళ్లు, చేతులు నరికేసిన భర్త

చిత్తూరులో జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ భర్త.. భార్య కాళ్లు, చేతులు నరికేశాడు.

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ భర్త.. భార్యను అతి కిరాతకంగా నరికాడు. అనుమానంతో భార్య కాళ్లు, చేతులు నరికేశాడు. ఈ ఘటన గంగాధర నెల్లూరు మండలం ఆరుమాకులపల్లిలో చోటు చేసుకుంది. ఆరుమాకులపల్లికి చెందిన సతీశ్, నాగమ్మ భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల క్రితం పెళ్లైంది. ఏడాది, ఆరునెలలు వయస్సు కలిగిన ఇద్దరు కుమారులు ఉన్నారు.

సతీశ్..భార్య నాగమ్మపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆదివారం(నవంబర్ 24, 2019) భార్యపై కత్తితో దాడి చేసి ఆమె కాళ్లు, చేతులు నరికి వేశాడు. రెండు కాళ్లు, రెండు చేతులు నరికి వేశాడు. కాళ్లకు తీవ్రస్థాయిలో గాయాలు అయ్యాయి. చేతులు, కాళ్లకు సంబంధించిన నరాలు పూర్తిగా తెగి పోయాయి. దీంతొ ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. రక్తపు మడుగులో ఉన్న నాగమ్మను స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తమిళనాడు వేలూరులోని సీఎమ్ సీ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.

భర్త సతీశ్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సతీష్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ’నా భార్య చెడు అలవాట్లకు అలవాటు పడింది. తన మాట వినడం లేదు. కాపురానికి రావడం లేదు. అమ్మగారి ఇంట్లోనే ఉంటుంది. నన్ను, పిల్లలను నిర్లక్ష్యం చేస్తూ వారి స్వగ్రామంలో ఉంటుంది. వ్యవహారాన్ని మార్చుకుని బుద్ధిగా ఉండాలని చెప్పినా వినలేదు. అందుకే కత్తి తీసుకుని చాలా సింపుల్ గా నరికివేశాను’ అని సతీశ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. భార్య పట్ల అమానుషంగా, కఠినంగా వ్యవహరించన సతీశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.