Chandrababu Naidu : కోవిడ్ వేరియంట్ : చంద్రబాబుపై కర్నూలులో నాన్ బెయిలబుల్ కేసు
Chandrababu Naidu : కరోనా వైరస్పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. N 440K వైరస్ ఉందని బాబు చేసిన కామెంట్స్పై కర్నూలు న్యాయవాది సుబ్బయ్య కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేసాయని… చర్యలు తీసుకోవాలని సుబ్బయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు తీసుకున్న పోలీసులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఐపీసీ సెక్షన్ 155, 505/1/B/2 జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా ప్రజల్లో భయాందోళనలు పెంచేలా వ్యవహరించినా.. ప్రభుత్వానికి, ప్రజలకు వ్యతిరేకంగా నేరానికి పాల్పడిన వారిపై ఐపీసీ సెక్షన్ 505/1/బి/2 కింద కేసు నమోదు చేస్తారు.
మరోవైపు కొత్త వైరస్పై ఏపీలో పొలిటికల్ ఫైట్ సీరియస్గా మారింది. కర్నూలులో N440K కరోనా కొత్త వేరియంట్ బయటపడిదన్న చంద్రబాబు ప్రకటనపై… టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందన్న చంద్రబాబుకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ వచ్చారు. చంద్రబాబు నిర్వాకంతో ఏపీ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో కారంటైన్లో ఉండే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.