Telangana : తాగుబోతు భర్తను హత్యచేసిన అత్తింటివారు

కట్టుకున్న భర్తను భార్య తో పాటు ఆమె తల్లిదండ్రులు కలిసి అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బీడీ కాలనీ లో చోటు  చేసుకుంది.

Telangana : తాగుబోతు భర్తను హత్యచేసిన అత్తింటివారు

kamareddy

Telangana :  కట్టుకున్న భర్తను భార్య తో పాటు ఆమె తల్లిదండ్రులు కలిసి అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బీడీ కాలనీ లో చోటు  చేసుకుంది. మృతి  చెందిన వ్యక్తిని కాసాల బ్రహ్మయ్యచారి(36)గా గుర్తించారు. కాసాల బ్రహ్మచారిని హత్య  చేసింది భార్య నందిని, మామ దత్తాత్రేయ, అత్త గంగామణి గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రూరల్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం ….. బిబిపేట మండల కేంద్రానికి చెందిన బ్రహ్మయ్యచారి 20 సంవత్సరాల క్రితం కామారెడ్డికి బతుకు దెరువు కోసం వచ్చాడు. కామారెడ్డి మండలం బీడీ కాలనీలో నివాసముండే నందినిని వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులుగా బ్రహ్మచారి మద్యంకు బానిసై తరచూ భార్య నందినితో గొడవ పడుతున్నాడు.

దీంతో విసిగిపోయిన నందిని ఆమె తల్లిదండ్రులు దత్తాత్రేయ,గంగామణి లు సోమవారం మధ్యాహ్నం సమయంలో బీడీ కాలనీకి వచ్చిన బ్రహ్మయ్య చారిపై కర్రలతో దాడి చేశారు. అనంతరం నైలాన్ తాడుతో ఉరివేసి హత్య చేశారు.
Also Read : Kurnool : కర్నూలు జిల్లాలో దారుణం-బాలుడి సజీవ దహనం
హత్య చేసిన తరువాత అక్కడి నుంచి నందిని, దత్తాత్రేయ, గంగామణిలు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని  సమీక్షించారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.