Man Killed Wife Brother : అన్నను బలిగొన్న చెల్లి ప్రేమ వ్యవహారం

సుబ్బి పెళ్లి ఎంకిచావుకొచ్చిందన్న తెలుగు సామెత లాగా అయ్యింది ఓ అన్నయ్య పరిస్ధితి. చెల్లి ప్రేమ పెళ్లి వ్యవహారం అన్న హత్యకు దారి తీసింది.

Man Killed Wife Brother : అన్నను బలిగొన్న చెల్లి ప్రేమ వ్యవహారం

Man Killed Wifes Brother

Man killed wife  brother due to love affair : సుబ్బి పెళ్లి ఎంకిచావుకొచ్చిందన్న తెలుగు సామెత లాగా అయ్యింది ఓ అన్నయ్య పరిస్ధితి.  చెల్లి ప్రేమ పెళ్లి వ్యవహారం అన్న హత్యకు దారి తీసింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్గుడి సమీపంలోని తిరుమంగళంకు చెందిన కృపన్ రాజ్ (27) చెన్నైలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అతనికి రాబిన్ సామేరి (26) అనే యువతితో గతేడాది వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కలిగాడు.

కృపన్ రాజ్ సోదరి గిరిజ ను, అతడి స్నేహితుడు… తిరుమంగళంకు చెందిన కవియరసన్ (27) ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం కృపన్ రాజ్ ఇంట్లో తెలిసిపోయింది. గిరిజ ప్రేమవ్యవహారం నచ్చిన పెద్దలు, ఆమెను వేరోక వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. దీంతో గిరిజ, కవియరసన్ ఇద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు.

ఇది కృపన్ రాజ్ కు నచ్చలేదు. ఈవిషయమై తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఏప్రిల్ 25న కవియరసన్ ఇంటి ముందు నుంచి కృపన్ రాజ్ బైక్ పై వెళుతుండగా …. కవియరసన్ ఇద్దరు సోదరులు అటకాయించి వాగ్వాదానికి దిగారు. కవియరసన్ కత్తితో కృపన్ రాజ్ పై దాడి చేశాడు. దీంతో అతడు స్పృహ తప్పాడు. వెంటనే అతడ్ని లాల్గుడి  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  పరీక్షించిన  వైద్యులు అప్పటికే మృతి  చెందినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.  నిందితులు కవియరసన్, అతని సోదరుడు కలైవానన్ సోమవారం సహాయపురం పోలీసులకు లొంగిపోయారు.