Minister Srinivas Goud : అందుకే శ్రీనివాస్ గౌడ్‌ను చంపాలనుకున్నాను-రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనను ఆర్ధికంగా ఎదగనీయకుండా అడుగుడుగునా అడ్డు తగులుతున్నాడనే కోపంతోనే రాఘవేంద్రరాజు హత్యకు కుట్ర పన్నినట్లు నిందుతుల రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పోందుపరిచారు

Minister Srinivas Goud : అందుకే శ్రీనివాస్ గౌడ్‌ను చంపాలనుకున్నాను-రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడు

Minister Srinivas Goud

Minister Srinivas Goud :  మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనను ఆర్ధికంగా ఎదగనీయకుండా అడుగుడుగునా అడ్డు తగులుతున్నాడనే కోపంతోనే రాఘవేంద్రరాజు హత్యకు కుట్ర పన్నినట్లు నిందుతుల రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పోందుపరిచారు. శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు రాఘవేంద్రరాజు కుటుంబ సభ్యులు సమావేశం అయ్యారు. తమను ఆర్థికంగా ఎదగనీయకుండా చేస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ను..హత్య చేయడమే మార్గమని అన్నదమ్ములు భావించారు. శ్రీనివాస్‌గౌడ్‌పై కోర్టు కేసుల కోసం రాఘవేంద్రరాజు కుటుంబం రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. జిరాక్స్‌ బిల్లులకే రూ.18 లక్షలు ఖర్చు చేశారు.

మంత్రి హత్యకేసు రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. శ్రీనివాస్‌గౌడ్‌ అనుచరుడు ఆనంద్‌ను గతంలో నాగరాజు కత్తితో పొడిచాడు. ఆనంద్‌, హైదర్‌ అలీ, శ్రీకాంత్‌గౌడ్‌  తమను వేధిస్తున్నారని రాఘవేంద్రరాజు బ్రదర్స్‌ పోలీసులకు చెప్పారు. తన భార్యతో పాటు తన తమ్ముళ్ల భార్యలను అరెస్ట్‌ చేయించటం వెనుక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హస్తముందని రాఘవేంద్రరాజు పోలీసులకు చెప్పాడు.

తనను రాజకీయంగా వాడుకొని వదిలేసినందుకే చంపాలనుకున్నానని రాఘవేంద్రరాజు పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో తెలిపాడు. రిటైర్డ్‌ ఆర్మీ వ్యక్తి అయిన తన తండ్రికి రావాల్సిన..భూమి, డబ్బులను శ్రీనివాస్‌గౌడ్‌ అడ్డుకున్నారని…నేను స్థాపించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు..డబ్బులు రాకుండా శ్రీనివాస్‌గౌడ్‌ అడ్డుకున్నారని రాఘవేంద్ర రాజు చెప్పారు.

నాకు రావాల్సిన ఎమ్మెల్సీని శ్రీనివాస్‌గౌడ్‌ అడ్డుకున్నారని..అందుకే రాఘవేంద్రరాజుకు సాయం చేయాలనుకున్నట్లు మరో నిందితుడు మున్నూరు రవి పోలీసు లకు విచారణలో వెల్లడించాడు.

తన కూతురు క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కు..రూ.20 లక్షలు ఇస్తానని శ్రీనివాస్‌గౌడ్‌ మోసం చేశాడని….శ్రీనివాస్‌గౌడ్‌ మాట వినడం వల్ల నా కూతురిని పోగొట్టుకున్నా యాదయ్య. అనే మరో వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు.
Also Read : Telangana Police : జితేందర్ రెడ్డి పీఏకు తెలంగాణ పోలీసుల నోటీసులు
మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సైబారాబద్ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై నేడు మేడ్చల్ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా‌కు మేడ్చల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు మిగిలిన నిందితులు సైతం బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. నేడు కోర్టు బెయిల్ పిటీషన్లు, కస్టడీ పిటీషన్లను విచారించనుంది.