Mumbai: ఎలుకల మందు కలిపిన టమాటాలతో వండిన మ్యాగీ తిని మహిళ మృతి

చిన్న నిర్లక్ష్యం ఏకంగా మహిళ ప్రాణం తీసింది. ఎలుకల్ని చంపేందుకు విషం కలిపిన టమాటాల్ని పొరపాటున వంటలో వేసింది. ఆ తర్వాత ఆ టమాటాలతో చేసిన మ్యాగీ నూడిల్స్ తిని ప్రాణాలు కోల్పోయింది.

Mumbai: ఎలుకల మందు కలిపిన టమాటాలతో వండిన మ్యాగీ తిని మహిళ మృతి

Mumbai

Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం జరిగింది. చిన్న నిర్లక్ష్యం ఒక ప్రాణం తీసింది. ఎలుకల మందు కలిపిన టమాటాల్ని పొరపాటున వేసి తయారు చేసిన మ్యాగీ తిని మహిళ మృతి చెందింది. ఈ ఘటన ముంబైలోని పస్కల్ వాడి ప్రాంతంలో ఇటీవల జరిగింది. రేఖా నిషద్ అనే మహిళ తన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో వాటిని చంపాలనుకుంది. దీనికోసం ఈ నెల 21న కొన్ని టమాటాలకు ఎలుకల మందు కలిపి వంట గదిలో ఉంచింది.

Bangladesh: మినీ బస్సును ఢీకొన్న రైలు.. 11 మంది మృతి

ఆ మరుసటి మ్యాగీ నూడిల్స్ చేసుకుని తినాలనుకుంది. టీవీ చూస్తూ వంట చేయడం వల్ల పొరపాటున ఎలుకల మందు కలిపిన టమాటాల్ని మ్యాగీలో వేసేసింది. ఆ తర్వాత అవే నూడిల్స్ తిన్నది. కొన్ని గంటల తర్వాత వాంతులు మొదలయ్యాయి. అప్పుడు విషయం అర్థం కావడంతో భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత బుధవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.