మనసులో ఉన్నవాడిని చేరుకోలేక..మనువాడిన వాడితో ఉండలేక…

మనసులో ఉన్నవాడిని చేరుకోలేక..మనువాడిన వాడితో ఉండలేక…

Newly married woman ends life : మనసు పడిన వాడిని మర్చిపోలేక… తాళి కట్టిన వాడితో కలిసి జీవించలేక… అర్ధాంతరంగా జీవితాన్ని చాలించింది వరంగల్ జిల్లాలో ఓ నవ వధువు. వరంగల్ అర్బన్ జిల్లా నారాయణగిరికి చెందిన మెడబోయిన రజాక్ కూతురు రవళికి, భీమదేవర పల్లి మండలం గాంధీనగర్ నివాసి ఐలబోయిన రాజుతో డిసెంబర్ 11న వివాహం జరిగింది. అయితే రవళి మరోక వ్యక్తిని ప్రేమించింది.

అయితే రవళి కుటుంబ సభ్యలు ఆమెకు వివాహ ప్రయత్నాలు చేస్తుండగానే అమె తన ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పింది. అయినా వారు ఆమె ప్రేమను అంగీకరించలేదు. వేరే సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ క్రమంలో రాజుతో సంబంధం ఖాయం చేసి ఈనెల 11 న వివాహం జరిపించారు. ఇంట్లో వారికి ఎదురు చెప్పలేక తలోంచుకుని పెద్దలు కుదిర్చిన రాజుతో తాళి కట్టించుకుంది. రాజుతో వివాహం అయితే అయ్యింది కానీ ఆమె మనసుపడ్డ ప్రియుడిని మర్చిపోలేక పోతోంది.

పెళ్లై రెండు వారాలైనా భర్తతో సఖ్యంగా ఉండలేక మానసిక సంఘర్షణకు లోనైంది. ఇష్టంలేని వ్యక్తితో జీవించటం కంటే చావే మేలనుకుంది. తన తల్లికి ఓ లేఖ రాసి సోమవారం తనువు చాలించింది. “అమ్మా.. నన్ను క్షమించండి. నేను సంతోషంగా ఉండాలని పెళ్లి చేశావు. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా మనసులో ఎవరున్నారో మీకు తెలుసు. నేను నా భర్తతో ఉండలేకపోతున్నా. ఎందుకంటే ఆయ‌న‌పై నాకు ఇష్టం లేదు. దీంతో ప్రతీ క్షణం నరకం అనుభవిస్తున్నా’ అంటూ తల్లిపేరున సూసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణానికి పాల్పడింది.