Pakistan : పాక్లో పరువు హత్యలు…ఇద్దరు కూతుళ్లను కాల్చిచంపిన తండ్రి
పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. ఓ తండ్రి పరువు కోసం తన ఇద్దరు కూతుళ్లను కాల్చి చంపి పారిపోయిన ఘటన పాకిస్థాన్ దేశంలో సంచలనం రేపింది....
Pakistan : పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. ఓ తండ్రి పరువు కోసం తన ఇద్దరు కూతుళ్లను కాల్చి చంపి పారిపోయిన ఘటన పాకిస్థాన్ దేశంలో సంచలనం రేపింది. పాక్ దేశం పంజాబ్ రాష్ట్రంలోని కసూర్ జిల్లా హవేలీ నథోవాలి గ్రామానికి చెందిన సయీద్ అనే తండ్రి తన ఇద్దరు కుమార్తెలపై కాల్పులు జరిపాడు. (Pakistan Man Shoots Two Daughters) ఈ కాల్పుల్లో ఇద్దరు కూతుళ్లు మరణించారు. (Honour Killing Incident)
Taliban Ban : అప్ఘానిస్థాన్లో మహిళా బ్యూటీ సెలూన్లపై తాలిబన్ల నిషేధాస్త్రం
అనంతరం తండ్రి నేర స్థలం నుంచి పారిపోయాడు. బాలికల మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పాక్ పోలీసులు చెప్పారు. పారిపోయిన తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పన్నెండేళ్ల బాలుడు పరువు కోసం గుజ్రాన్ వాలా శాటిలైట్ టౌన్ లో తల్లిని చంపిన ఘటన ఈ వారంలోనే జరిగింది. తల్లి వీధిలో నడిచి వెళుతుండగా 12 ఏళ్ల కుమారుడు ఆమెను కాల్చిచంపాడు. పాకిస్థాన్ దేశంలో తరచూ పరువు హత్యలు జరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.