Robbery In Hyderabad : వీడు మామూలోడు కాదు….రిటైర్డ్ డీజీపీ ఇంట్లోనే చోరీ చేశాడు

నేను పోలీసు బాసు‌గా రిటైర్ అయ్యాను... నాఇల్లు సురక్షితంగా ఉందనుకోటానికి వీలు లేకుండా పోయింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న రిటైర్డ్ డీజీపీ ఇంట్లో రూ. 5లక్షలు మాయం అయ్యింది. దొంగలు బయట నుంచి వచ్చారా.. ఇంటి దొంగల పనేనా అనేది తేలాల్సి ఉంది.

Robbery In Hyderabad : వీడు మామూలోడు కాదు….రిటైర్డ్ డీజీపీ ఇంట్లోనే చోరీ చేశాడు

Robbery In Hyderabad

Robbery In Hyderabad : నేను పోలీసు బాసు‌గా రిటైర్ అయ్యాను… నాఇల్లు సురక్షితంగా ఉందనుకోటానికి వీలు లేకుండా పోయింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న రిటైర్డ్ డీజీపీ ఇంట్లో రూ. 5లక్షలు మాయం అయ్యింది. దొంగలు బయట నుంచి వచ్చారా.. ఇంటి దొంగల పనేనా అనేది తేలాల్సి ఉంది.

వివరాల్లోకి వెళితే…. జూబ్లిహిల్స్ రోడ్ నెం.10(సీ) లోని ప్లజెంట్ వ్యాలీ లో నివసించే రిటైర్డ్ డీడీపీ రాయ్ వినయ్ రంజన్ ఇంట్లో రూ. 5లక్షల నగదు చోరీకి గురయ్యింది. ఈ మేరకు ఆయన జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పని చేస్తున్న సీపీఎల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రభుదాస్, పనిమనిషి కుమారిపై అనుమానం ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కోన్నారు.

తన బెడ్‌రూం లోని బ్రీఫ్ కేసులో రూ.2 వేల నోట్లు, రూ.500 నోట్లతో రూ.5 లక్షలు డబ్బు పెట్టడం జరిగిందని ఈ నెల4వ తేదీన చోరీ జరిగినట్లు ఆయన తెలిపారు. ఇది ఇంటి దొంగలపనే అయి ఉంటుందని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా డీజీపీ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు పలు ఆధారాలు సేకరించి అనుమానితులను విచారిస్తున్నారు.