Hyderabad : స్టార్ హోటల్లో లక్ష రూపాయలు చోరీ
హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో లక్ష రూపాయలు చోరీకు గురయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్ లో సందీప్ శర్మ అనే వ్యక్తి
Hyderabad : హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో లక్ష రూపాయలు చోరీకు గురయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్ లో సందీప్ శర్మ అనే వ్యక్తి నిన్నటి వరకు 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించాడు.
అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్ నుంచి నిన్న లక్ష రూపాయలు నగదు చోరీకి గురైనట్లు సందీప్ శర్మ గుర్తించాడు.వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read :love Affair : క్లాస్మేట్తో భార్య లవ్ ఎఫైర్-భర్తకు తెలియటంతో ..
ఘటనా స్ధలానికి వచ్చి, హోటల్ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. ఆ ఫుటేజిలో బ్లాక్ సూట్ వేసుకుని తెల్ల పర్సు తో వచ్చిన మహిళ లక్ష రూపాయలు నగదు దొంగిలించినట్లు గుర్తించారు. పోలీసులు ఇప్పుడు సదరు మహిళను గుర్తించే పనిలో పడ్డారు.