నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రమాదం : కేర్, నిమ్స్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి కేర్, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 06:54 PM IST
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రమాదం : కేర్, నిమ్స్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి కేర్, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్టాల్స్‌కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు.

నుమాయిష్‌ జరుగుతుండటంతో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు ఎగ్జిబిషన్‌కు తరలివచ్చారు. 2019, జనవరి 30వ తేదీ బుధవారం రాత్రి అనూహ్య రీతిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో చాలామందికి గాయాలయ్యాయి. ఇంకా అనేకమంది స్టాల్స్‌లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు చేసిన స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం అందుతోంది. 

ఈఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బందికి కూడా గాయాలు అయ్యాయి. నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. కొంతమందికిమ నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన మరికొంతమందిని చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులకు చికిత్స అందిస్తున్నారు.