Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కారును ఢీకొట్టిన ట్రక్కు.. జమ్మూ కశ్మీర్‭లో ప్రమాదం

దారిలో కారులో రోడ్డు ప్రయాణాన్ని వీడియో తీసి, దాన్ని ట్విట్టర్‭లో షేర్ చేశారు. ‘‘జమ్మూ కశ్మీర్ లోని ఉద్దాంపూర్ లో నిర్వహించే న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాను. ప్రయాణం అంతా అందమైన రహదారిని ఆనందించవచ్చు’’ అని రాసుకొచ్చారు.

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కారును ఢీకొట్టిన ట్రక్కు.. జమ్మూ కశ్మీర్‭లో ప్రమాదం

kiren rejiju's car met with accident

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి హానీ జరగలేదు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన కారును శనివారం రాంబన్ జిల్లాలో శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై వెళ్తుండగా ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఆయనే కాకుండా కారులో ఉన్నవారంతా క్షేమంగానే ఉన్నట్లు తెలిసింది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

దీనికి ముందు కిరణ్ రిజిజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు ఉద్దాంపూర్ వెళ్తున్నట్లు ట్వీట్ చేశారు. దారిలో కారులో రోడ్డు ప్రయాణాన్ని వీడియో తీసి, దాన్ని ట్విట్టర్‭లో షేర్ చేశారు. ‘‘జమ్మూ కశ్మీర్ లోని ఉద్దాంపూర్ లో నిర్వహించే న్యాయ సేవల శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాను. ప్రయాణం అంతా అందమైన రహదారిని ఆనందించవచ్చు’’ అని రాసుకొచ్చారు.