13వేల 487 పోస్టులు : రైల్వే జాబ్స్ లాస్ట్ డేట్

  • Published By: madhu ,Published On : January 5, 2019 / 03:37 AM IST
13వేల 487 పోస్టులు : రైల్వే జాబ్స్ లాస్ట్ డేట్

హైదరాబాద్ : భారతీయ రైల్వేలో ఖాళీ పోస్టులకు చివరి తేదీని ప్రకటించారు. 2019, జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు జనవరి 4వ తేదీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైల్వేలో కెమికల్ – మెటలర్జికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 13, 487 పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చింది. మరిన్ని వివరాలకు http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,4,1244 లింక్‌లో సంప్రదించాలని సూచించారు.