ఇంటర్ బోర్డు నుంచి గ్లోబరీనా తొలగింపు 

  • Published By: chvmurthy ,Published On : May 11, 2019 / 04:09 AM IST
ఇంటర్ బోర్డు నుంచి గ్లోబరీనా తొలగింపు 

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక ఫలితాల ప్రక్రియలో జరిగిన తప్పులతో గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం పక్కన పెట్టింది. త్వరలో జరుగబోయే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్‌ కోసం కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు ఇంటర్మీడియేట్ బోర్డు కొత్తగా టెండర్లు పిలించింది. ఈ నెల 25 నుంచి జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 3.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల ఫలితాలను కొత్త సంస్ధ  ప్రోసెస్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ఇంటర్ ఫలితాలలో జరిగిన తప్పులతో అభాసు పాలైన ఇంటర్ బోర్డు ఆ పనుల బాధ్యతలను గ్లోబరీనాకు అప్పగించకుండా, కొత్త సంస్థకు అప్పగించేందుకు సిధ్దమయ్యంది.  తెలంగాణ స్టేట్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌) ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లను పిలించింది. కనీసం 10 లక్షల మంది విద్యార్థుల డాటా ప్రాసెస్‌ చేసి ఉండాలన్న నిబంధనను అందులో పొందుపరిచారు. అంతేకాకుండా గతంలో 2 ఏళ్లపాటు ఇంటర్‌ బోర్డులో పనిచేసి ఉండకూడదనే నిబంధన కూడా విధించింది. దీంతో గ్లోబరీనా సంస్థకి ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా  పోయింది.