పరీక్షా కాలం : ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్

  • Published By: madhu ,Published On : January 30, 2019 / 02:15 AM IST
పరీక్షా కాలం : ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్

హైదరాబాద్ : ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, గురుకుల, సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. నాలుగు దశల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. 2019 సంవత్సరం..3,27,761 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని..హాల్ టికెట్లను bie.telangana.gov.in వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని బోర్డు పేర్కొంది.