Telangana : తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు జారీ
తెలంగాణలో ఈనెల 12వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు జారీ చేయనున్నటు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.
Telangana : తెలంగాణలో ఈనెల 12వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు జారీ చేయనున్నటు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఇప్పటికే హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద నుంచి విద్యార్ధులు తమ హాల్ టికెట్లు పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
12వ తేదీ గురువారం నుంచి విద్యాశాఖ వెబ్ సైట్ లో కుడా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యార్ధులు www.bse.telangana.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చిన కృష్ణారావు చెప్పారు. కాగా ఈనెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయి.