8 మందితో కాంగ్రెస్ జాబితా : మల్కాజ్ గిరి నుంచి రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చేసింది. మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగతా 9 స్థానాలను పెండింగ్లో ఉంచింది. ఆ స్థానాల్లోని అభ్యర్థులను రాహుల్గాంధీ ఫైనల్ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ… లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలనుకుంటోంది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించి వడపోసి… గెలుపు గుర్రాలను ఖరారు చేసింది. ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ.. 8మంది పేర్లతో తొలిజాబితా విడుదల చేసింది.
నియోజకవర్గం | అభ్యర్థి పేరు |
మల్కాజ్ గిరి | రేవంత్ రెడ్డి |
చేవెళ్ల | కొండా విశ్వేశ్వరెడ్డి |
కరీంనగర్ | పొన్నం ప్రభాకర్ |
జహీరాబాద్ | మదన్ మోహన్ |
ఆదిలాబాద్ | రమేష్ రాథోడ్ |
పెద్దపల్లి | ఎ.చంద్రశేఖర్ |
మెదక్ | గాలి అనిల్ కుమార్ |
మహబూబాబాద్ | బలరాం నాయక్ |
ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్ సహా మొత్తం 9 స్థానాలను పెండింగ్లో ఉంచారు. ఈ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను మార్చి 16వ తేదీ శనివారం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు.. అభ్యర్థుల ఎంపికపై తుదినిర్ణయం రాహుల్దేనన్న నాయకులు… అందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.