Prashant Kishor: నితీశ్ కుమార్‌కు సవాలు విసిరిన ప్రశాంత్ కిశోర్

బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా నితీశ్ కుమార్‌కు ప్రశాంత్ కిశోర్ ఓ సవాలు విసిరారు. ‘‘నితీశ్ కుమార్ మీకు బీజేపీ/ఎన్డీఏతో ఎలాంటి సంబంధమూ లేకుంటే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగాలని మీ ఎంపీకి చెప్పండి. అన్ని సమయాల్లోనూ ఏదైనా ఒక మార్గాన్ని మాత్రమే ఎంచుకోవాలి’’ అని అన్నారు.

Prashant Kishor: నితీశ్ కుమార్‌కు సవాలు విసిరిన ప్రశాంత్ కిశోర్

Prashant kishor

Prashant Kishor: బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా నితీశ్ కుమార్‌కు ప్రశాంత్ కిశోర్ ఓ సవాలు విసిరారు. ‘‘నితీశ్ కుమార్ మీకు బీజేపీ/ఎన్డీఏతో ఎలాంటి సంబంధమూ లేకుంటే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగాలని మీ ఎంపీకి చెప్పండి. అన్ని సమయాల్లోనూ ఏదైనా ఒక మార్గాన్ని మాత్రమే ఎంచుకోవాలి’’ అని అన్నారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఉన్నారు. ఆయన నితీశ్ కుమార్ పార్టీ జేడీయూకి చెందిన ఎంపీ. ప్రశాంత్ కిశోర్ చేస్తున్న వ్యాఖ్యలకు నితీశ్ కుమార్ స్వయంగా కౌంటర్లు ఇస్తున్నారు. బిహార్ లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నేతలను గుర్తించటం, వారిని ప్రోత్సహించడం వంటి అంశాలపై ప్రస్తుతం నితీశ్ కుమార్ దృష్టి పెట్టారు.

పలు రంగాల్లోని నిపుణుల ఆలోచనలను అమలు చేసేలా విధానాలను రూపొందిస్తున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ లక్ష్యంగా ఆయన విమర్శలు చేస్తున్నారు. గతంలో నితీశ్ కుమార్ పార్టీ జేడీయూకి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాత విభేదాలు వచ్చి ఆ పార్టీకి దూరమయ్యారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..