One Kidney Village : ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒక్క కిడ్నీతోనే జీవిస్తున్నారు..!!

ఒక కిడ్నీ పాడైపోయినా లేకపోయినా..ఒక్క కిడ్నీతో అయినా సరే జీవించవచ్చు అనే ఆలోచనతో కిడ్నీలు రోడ్డు పక్కన ఇడ్లీల్లా అమ్మేసుకుంటున్నారు ఆ గ్రామంలోని ప్రజలు..

One Kidney Village : ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒక్క కిడ్నీతోనే జీవిస్తున్నారు..!!

One Kidney Village

One Kidney Village In Afghanisthan : మన శరీరంలో ప్రతీ అవయం విలువైనదే. అటువంటి అవయవాల్లో కిడ్నీలు చేసే ఫిల్టరింగ్ చాలా చాలా ముఖ్యమైనది. కిడ్నీలు పాడైపోతే శరీరంలో కర్తం కలుషితం అయిపోతుంది. అలా కాకుండా కాపాడుతాయి కిడ్నీలు. ఒక కిడ్నీ పాడైపోయినా లేకపోయినా..ఒక్క కిడ్నీతో అయినా సరే జీవించవచ్చు. అందుకేనేమో కిడ్నీలు రోడ్డు పక్కన ఇడ్లీల్లా అమ్మేస్తున్నారు. కిడ్నీలు అమ్ముకోవటం కేవలం డబ్బు కోసమే కాదు..బతికి బట్ట కట్టాలంటే కిడ్నీ అమ్ముకునే దుస్థితికి గురి అవుతున్నారు అఫ్ఘనిస్థాన్ లోని ఓ గ్రామం ప్రజలు. నిజానికి అఫ్ఘానిస్థాన్ (afghanistan) తాలిబన్ల (taliban)పాలన ప్రారంభం నాటినుంచి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.

Also read : afghan crisis :అఫ్గాన్ ఆకలి కేకలు..చంటిబిడ్డల కడుపు నింపటానికి ఇంట్లో వస్తువులు అమ్మేస్తున్న దుస్థితి

దీంతో ప్రజలు తమ కడుపులు నింపుకోవటానికి..కుటుంబాలను పోషించుకోవటానికి కిడ్నీలు అమ్ముకోవల్సిన దుస్థితుల్లో పడిపోయారు. అందుకే అప్ఘానిస్థాన్ లో శరీరంలోని అవయవాలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ముఖ్యంగా అప్ఘాన్ లోని ఓ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరు ఒక్కో కిడ్నీతోనే జీవింస్తున్నారు. అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న ‘వన్ కిడ్నీ విలేజ్’ గా పేరొందింది. షెన్‌షైబా బజార్ హెరాత్ నగరానికి సమీపంలో ఉన్న ఒక అఫ్ఘాన్ గ్రామం ఒక కిడ్నీ ఉన్న వ్యక్తులతో నిండిన గ్రామంగా మారింది. అదే ‘షెన్‌షైబా బజార్’ గ్రామం,

2021 తాలిబన్లు(Talibans) హస్తగతం చేసుకుని పాలన ప్రారంభించిననాటినుంచి ప్రజల కష్టాలు మొదలయ్యాయి. తినటానికి తిండి కూడా లేని దుస్థితి. దీంతో అక్కడ ప్రజల జనజీవనం మరింత దారుణ స్థితికి చేరుకుంది. ఆకలి దప్పులను కూడా తీర్చుకొని కటిక పేదరికానికి చేరుకున్నారు అఫ్ఘాన్ ప్రజలు. పేదరికంలో కూరుకుపోయిన అప్ఘాన్ పౌరులు ఆకలి తీర్చుకునేందుకు కిడ్నీలను అమ్ముకుంటున్నారు. అసలే పేద దేశం.. ఇక తాలిబన్లు అధికారం చేపట్టాక మరింత దారుణ పరిస్థితి. కొన్ని లక్షల మంది ప్రజలు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. 3.89కోట్లకు పైగా జనాభా ఉన్న ఆప్ఘన్‌లో 59 శాతం జనాభా కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.

Also read : Afghan 9 years girl sell : అఫ్గాన్‌లో అంగట్లో ఆడపిల్లలు..పెళ్లి పేరుతో డబ్బు కోసం కన్నవారే అమ్మేస్తున్నారు..

ఆకలిని తీర్చుకోవాడికి కిడ్నీలను అమ్ముకుంటున్నారు. అలా వచ్చిన డబ్బులతో తమ కుటుంబ సభ్యుల ఆకలిని తీరుస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో మానవ అవయవాల అక్రమరవాణా చట్ట విరుద్ధం.. కానీ అఫ్ఘాన్ లో ఎటువంటి నియమ నిబంధనలు లేవు. దీంతో అక్కడ అధికారికంగానే డాక్టర్లకు తమ కిడ్నీలను అమ్ముతారు. ఇలా సేకరించి కిడ్నీలు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ ఇప్పటి వరకూ తెలియదు. దీంతో కచ్చితంగా ఆ దేశంలో గత ఏడాది నుంచి ఎంత మంది కిడ్నీలు అమ్ముకున్నారా చెప్పడం చాలాకష్టంగా మారింది. గత కొన్నేళ్లుగా హెరాత్ ప్రావిన్స్‌లోనే వందల సంఖ్యలో కిడ్నీ తొలగింపు ఆపరేషన్లు జరిగాయని రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ప్రజలు ఆర్థిక సమస్యలను గట్టెక్కడానికి కనీసం ఆహారం తినడానికి కిడ్నీ అమ్ముకోవడం ఒకటే మార్గమని అనుకుంటున్నారు.వారి వేరే దారి కూడాకనిపించని పరిస్థితి.

దీంతో ఒక కిడ్నీతో బతుకీడుస్తూ మరో కిడ్నీని అమ్ముకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య ఇక్కడ రోజు రోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా ‘షెన్‌షైబా బజార్’ గ్రామస్తులందరూ తమ కిడ్నీని అమ్ముకున్నవారే.. ఇక్కడ ప్రస్తుతం ఒక కిడ్నీతో జీవిస్తున్నవారే ఉన్నారు. ఈ దుస్థితి గురించి ‘షెన్‌షైబా బజార్’ గ్రామంలోని ఒక మహిళ మాట్లాడుతూ..‘నా భర్త పని చేయడం లేదు అసలు పనే దొరకటంలేదు. ఇంటినిండా అప్పులు. తినటానికి తిండి కూడా లేదు. అందుకే తన కిడ్నీని $2,900 (అఫ్ఘానిస్థాన్ కరెన్సీ) అదే భారత కరెన్సీలో 250,000లకు అమ్ముకున్నాను అని తెలిపింది.

Also read : Taliban ban foreign currency : అఫ్ఘానిస్థాన్ లో విదేశీ కరెన్సీపై నిషేధం విధించిన తాలిబన్లు

మరొక బాధితురాలు తన పిల్లలు అడుక్కుంటూ వీధుల్లో తిరుగుతున్నారని, తన కిడ్నీని అమ్మకపోతే.. ఏడాది వయసున్న కూతురిని అమ్మవలసి వస్తుందని కన్నీటితో వాపోయింది. మా కిడ్నీలను అమ్ముకోవడం వలన ఒక్క కిడ్నీతో కష్టమైన పనులు చేయలేమని, కనీసం బరువులు కూడా ఎత్తలేమని..కానీ బతకాలంటే కిడ్నీ అమ్ముకోవాల్సిన దుస్థితిలో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత ఆర్థికంగా ఘోరమైన పరిస్థితి ఉందనడానికి ఈ గ్రామం నిదర్శనంగా కనిపిస్తోంది.