నేపాల్ గ్రామాలు,11వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించిన చైనా
ఓ వైపు భారత్ సరిహద్దుల్లో భూభాగాలను ఆక్రమించేందుకు కుయుక్తులు పన్నుతున్న చైనా.ఇప్పుడు నేపాల్ పై కన్నేసింది. నేపాల్ గ్రామాలను,ల్యాండ్స్ ను చైనా ఆక్రమిస్తోంది. నేపాల్లోని ఒక గ్రామాన్ని అయితే చైనా పూర్తిగా ఆక్రమించి, అక్రమణను చట్టబద్ధం చేయడానికి సరిహద్దు పోస్టులను కూడా తొలగించినట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు మంగళవారం మంగళవారం తెలిపాయి. అనేక నేపాలీ భూభాగాల్లోకి ప్రవేశించడానికి అంతర్గత లక్ష్యాన్ని చైనా క్రమంగా కంట్రోల్ లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొన్నటివరకు నేపాల్ ఆధీనంలోని సరిహద్దు గ్రామమైన గూర్ఖా జిల్లాలోని రూయి గ్రామం ఇప్పుడు పూర్తి చైనా నియంత్రణలో ఉంది. చైనీయులు రుయి గ్రామాన్ని పూర్తిగా ఆక్రమించారు. సుమారు 722 ఇళ్ళు ఉన్న ఆ గ్రామంలోని నివాసితులు వారి అసలు గుర్తింపు కోసం పోరాడుతున్నారు. ప్రస్తుత నేపాల్ ప్రభుత్వం చైనాకు ఎలా లొంగిపోయిందో, భారత వ్యతిరేక వాక్చాతుర్యాన్ని చేస్తూ, భారత వ్యతిరేక కార్యకలాపాలను ఆశ్రయిస్తోందని కూడా ఇది చూపిస్తుంది అని ఒక ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. కొంతకాలంగా చైనా అండతో నేపాల్.. భారత్ పై అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
నేపాల్ వ్యాప్తంగా 11 ప్రదేశాలలో వ్యూహాత్మక భూములను చైనా ఆక్రమించింది
రూయి గ్రామంతో పాటుగా, నేపాల్ వ్యాప్తంగా 11 వ్యూహాత్మక ల్యాండ్ ను చైనా ఆక్రమించింది. చైనా సరిహద్దులో ఉన్న నేపాల్ సరిహద్దులోని నాలుగు జిల్లాల్లో 3 హెక్టార్ల భూమిని చైనా అక్రమంగా ఆక్రమించింది. టిబెట్లో రోడ్డు నిర్మిస్తున్న చైనా.. నేపాల్ భూభాగాన్ని కూడా వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నేపాల్ లోని ఓలీ ప్రభుత్వం తాజాగా దీనిపై ఓ నివేదికను రిలీజ్ చేసింది. నేపాల్ వ్యవసాయశాఖకు చెందిన సర్వే డిపార్ట్మెంట్ ఈ నివేదిక తయారు చేసింది. సహజ సరిహద్దులుగా ఉన్న నదులను మళ్లించి.. చైనా ఈ ఎత్తుగడలు వేస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం తన నివేదికలో పేర్కొన్నది.
టిబెట్ అటానమస్ రీజియన్ ప్రాంతంలో సుమారు పది చోట్ల చైనా ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులను చేపడుతున్నది. దీని వల్ల నదులు, వాటి ఉపనదులు ప్రవాహాన్ని మార్చుకుని నేపాల్ వైపు వస్తున్నాయని, ఒకవేళ ఇదే ప్రక్రియ కొనసాగితే అప్పుడు టీఏఆర్ ప్రాజెక్టు కోసం నేపాల్ చాలా వరకు తన భూభాగాన్ని కోల్పోవలసి వస్తుందని ప్రభుత్వ నివేదికలో తెలిపారు. హుమ్లా జిల్లాలోని బగ్దరే ఖోలా నది, కర్నాలి నది ప్రవాహాలను మార్చి .. ఆ ప్రాంతాల్లో దాదాపు పది హెక్టార్ల నేలను చైనా ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రసువా జిల్లాలో కూడా ఆరు హెక్టార్ల స్థలాన్ని నేపాల్ కోల్పోయింది.
Read: అమెరికాలో సిక్కు రెస్టారెంట్ పై శ్వేతజాతీయుల దాడి..