Covid In China : చైనాపై విరుచుకుపడుతున్న కరోనా,రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు,ఇది శాంపిల్ మాత్రమేనంటున్న నిపుణులు

చైనాలో ఊహించిందే జరుగుతోంది. కరోనా విలయతాండవం చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వెల్లువతో చైనా ప్రజలు అల్లాడుతున్నారు. సరిపడా టెస్టులు లేవు. కావల్సిన మందులు లేవు. ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకడం లేదు. చివరకు ఆఖరి మజిలీకి శ్మశనాల్లోనూ ఎదురుచూడాల్సిన దుస్థితి. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేసిన చైనాను వైరస్ కమ్మేస్తోంది. ఇప్పుడు చూస్తోంది శాంపిలేనని..పెను విధ్వసం పొంచి ఉందని వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి.

Covid In China : చైనాపై విరుచుకుపడుతున్న కరోనా,రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు,ఇది శాంపిల్ మాత్రమేనంటున్న నిపుణులు

Covid In China

Covid In China :  చైనాలో ఊహించిందే జరుగుతోంది. కరోనా విలయతాండవం చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వెల్లువతో చైనా ప్రజలు అల్లాడుతున్నారు. సరిపడా టెస్టులు లేవు. కావల్సిన మందులు లేవు. ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరకడం లేదు. చివరకు ఆఖరి మజిలీకి శ్మశనాల్లోనూ ఎదురుచూడాల్సిన దుస్థితి. జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తేసిన చైనాను వైరస్ కమ్మేస్తోంది. ఇప్పుడు చూస్తోంది శాంపిలేనని..పెను విధ్వసం పొంచి ఉందని వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి.

హైరౌ స్మశానవాటికలో ఓ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి మూడు రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. చైనాలో కరోనా విధ్వంసానికి ఇదో ఉదాహరణ. ఇది ఊహించిందే అయినప్పటికీ ఈ పరిస్థితులు ఎదుర్కోవడం చైనాకు సవాల్‌గా మారింది. జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా గత నెల చివరి వారానికి నిరసనలు తీవ్ర రూపు దాల్చాయి. ఈ నెల ప్రారంభానికి చైనా అంతటా ఆందోళనలు పెల్లుబికాయి. యూనివర్శిటీలో జిన్‌పింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాయి. ఫలితంగా కరోనా కఠిన నియమావళి ఎత్తేయక తప్పలేదు. ఇలా జీరో కోవిడ్ విధానం ఎత్తివేశారో లేదో…అలా వైరస్ విజృంభణ మొదలయింది. 15 రోజుల్లోనే పరిస్థితి చేయిదాటిపోయింది. అసలు కరోనా ఎంతమందికి సోకిందన్నది కచ్చితమైన లెక్కలు తేలడం లేదు. కోవిడ్ మందులకు కొరత ఏర్పడుతోంది. ఆస్పత్రులు, మెడికల్ షాపులు కిటకిటలాడుతున్నాయి.

చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా అన్ని వేరియంట్లలోనూ ఇదే అన్నింటికన్నా వేగంగా వ్యాప్తిచెందేది. ఓ వ్యక్తికి వైరస్ సోకిందని తెలుసుకునే లోపే..వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. దీంతో చైనాలోని చాలా నగరాల్లో కుటుంబాలకు కుటుంబాలు కరోనా బారిన పడుతున్నాయి. వైరస్ తీవ్రతతో కరోనా మరణాలూ మొదలయ్యాయి. ఇద్దరు చైనా జర్నలిస్టులు వైరస్‌తో చనిపోయారు. అయితే ఆ సీనియర్ జర్నలిస్టులిద్దరూ 70 ఏళ్ల పైబడ్డవారే. సాధారణ ప్రజలతో పాటు రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్సులు ఒమిక్రాన్‌ బారిన పడుతున్నారు. స్మశానవాటిక సిబ్బందికి సైతం కరోనా సోకడంతో..అక్కడ విధి నిర్వహణ కష్టంగా మారింది.

కరోనా తీవ్రంగా వ్యాపించిన ఏప్రిల్‌ కన్నా ఎక్కువగా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి మళ్లీ ఆంక్షల బాట పట్టడం మినహా మరో మార్గం కనిపించడం లేదు చైనాకు. వాణిజ్య నగరం షాంఘైలో ఇప్పటికే ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. చాలా స్కూళ్లలో టీచర్లు, స్కూల్ సిబ్బంది కరోనాతో బాధపడుతున్నారు. నర్సరీలు, డే కేర్ సెంటర్లు మూసివేస్తున్నారు. పెరుగుతున్న కేసులుకు తగ్గట్టుగా చికిత్స సదుపాయాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా తాత్కాలిక ఆస్పత్రులు, మెడికల్ సెంటర్లు అందుబాటులోకి తెస్తున్నారు. షాంఘైలో అదనంగా 2లక్షల 30వేల అదనపు బెడ్లు సమకూర్చారు.

మరోవైపు చైనాలో కరోనా వ్యాప్తిపై వైద్యనిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో చైనాలో కరోనా విస్ఫోటనం చూస్తామని…అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ హెల్త్ మెట్రిక్స్ హెచ్చరించింది. ఇప్పటికన్నా 2023లో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంటుందని, చైనా ప్రజల్లో మూడోవంతుమంది వైరస్ బారిన పడనున్నారని అంచనా వేసింది. ఏప్రిల్ ఒకటి నాటికి వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుతుందని తెలిపింది. పదిలక్షలమంది కరోనాతో చనిపోయే ప్రమాదముందని వెల్లడించింది. చైనాలో మరికొన్ని సంస్థలు..జనవరరిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాయి. 60శాతం జనాభాకు వైరస్ సోకుతుందని, వృద్ధులకు ముప్పు ఎక్కువగా ఉంటుందని అంచనావేశాయి.

ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న దేశమైన చైనా..ఆ స్థాయిలో ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ చేయలేదు. జీరో కోవిడ్ విధానం రూపొందించింది కానీ..ప్రజలకు కరోనా నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్లపై దృష్టిపెట్టలేదు. అసలు చైనా వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను ఏమీ చేయలేకపోతున్నాయి. షాంఘైలోని ఫుడాన్ యూనివర్శిటీ అంచనాలు మరింత భయానకంగా ఉన్నాయి. 15లక్షల 50వేలమంది కరోనాతో మరణించే ప్రమాదముందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకు ఇప్పుడున్న వాటి కన్నా 15.6 రెట్లు ఎక్కువ డిమాండ్ పెరుగుతుందని తెలిపాయి. 80 ఏళ్లు పైబడినవారిలో వ్యాక్సిన్ వేయించుకోని 80లక్షల మంది ప్రజలకు రిస్క్ ఎక్కువగా ఉందని, షుగర్ పేషెంట్లూ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పరిశోధకులు హెచ్చరించారు.

మూడేళ్లగా ఆంక్షల మధ్య గడిపిన ప్రజలు కరోనా నిబంధనల ఎత్తివేతతో దేశమంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంతే స్వేచ్ఛగా కరనా వ్యాపిస్తోంది. చైనా కొత్త సంవత్సరం వేడుకలు జరిగే జనవరి చివరి వారం నాటికి కేసులు భారీగా నమోదవుతాయన్న ఆందోళన వ్యకమవుతోంది. గ్రామాలకు వెళ్లే చైనీయులు మాస్క్, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు జీరో కోవిడ్ విధానంతో చైనాకు ఇప్పటివరకు హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదు. దీనికి తోడు కావల్సినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. దీంతో కరోనా విస్ఫోటనంగా మారుతోంది. ఇది బద్ధలవ్వకముందే…కేసుల నియంత్రణకు చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం.