Plane Crash : పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో కూలిన విమానం…9మంది మృతి

ఎర్ర సముద్ర రాష్ట్రంలోని పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో ఓ విమానం కుప్పకూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా కూలిపోయిన పౌర విమానంలో నలుగురు సైనిక సిబ్బందితో సహా 9మంది మరణించారు....

Plane Crash :  పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో కూలిన విమానం…9మంది మృతి

Civilian Plane Crashes

Updated On : July 24, 2023 / 6:13 AM IST

Plane Crash : ఎర్ర సముద్ర రాష్ట్రంలోని పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో ఓ విమానం కుప్పకూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా కూలిపోయిన పౌర విమానంలో నలుగురు సైనిక సిబ్బందితో సహా 9మంది మరణించారు. (Civilian Plane Crashes) ఈ ప్రమాదంలో ఒక ఆడ శిశువు ప్రాణాలతో బయటపడిందని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఆంటోనోవ్ విమానం కూలిపోవడానికి ముందు టేకాఫ్ అవుతుండగా విఫలమై కూలిపోయింది.

Airport flooded : జలమయం అయిన అహ్మదాబాద్ విమానాశ్రయం…వీడియోలు వైరల్

పోర్ట్ సుడాన్ (Port Sudan airport) విమానాశ్రయంలో ఆంటోనోవ్ విమానం కూలిపోవడానికి కారణం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం అని సుడాన్ ఆర్మీ ప్రతినిధి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సూడాన్ ఏప్రిల్ 15వతేదీ నుంచి రాజధాని ఖార్టూమ్, ఇతర ప్రాంతాల్లో సూడాన్ సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

VRA System : శాశ్వతంగా వీఆర్ఏ వ్యవస్థ రద్దు, వారసులకు ప్రభుత్వ ఉద్యోగం.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

ఖార్టూమ్‌కు తూర్పున 890 కి.మీ దూరంలో ఉన్న పోర్ట్ సుడాన్ విమానాశ్రయం, పోరాడుతున్న పార్టీల మధ్య సాయుధ ఘర్షణల కారణంగా ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేవలను నిలిపివేశారు. ఆ తర్వాత పోర్ట్ సుడాన్ విమానాశ్రయాన్ని దేశంలోని ప్రధాన విమానాశ్రయంగా ఉపయోగిస్తున్నారు.