Viral News: దేవుడి పాదాలపై తలపెట్టి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. వీడియో వైరల్
రాజేష్ మెహానీ అనే వ్యక్తి మెడికల్ షాపు నిర్వాహకుడు అతడు సాయి భక్తుడు. ప్రతీ గురువారం దగ్గరలోని సాయి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు. ఎప్పటిలాగానే గుడికి వెళ్లాడు. ప్రార్థనల అనంతరం దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆయన పాదాలపై తలపెట్టాడు. అలాగే ప్రాణాలు కోల్పోయాడు.
Viral News: మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్నీ జిల్లాలో ఓ ఆలయంలో ప్రార్థనలు చేస్తుండగా గుండెపోటుతో వ్యక్తి మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేష్ మెహానీ వ్యక్తి మెడికల్ షాపు నిర్వాహకుడు. అతడు సాయి భక్తుడు. ప్రతీ గురువారం దగ్గరలోని సాయి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు. ఎప్పటిలాగానే గుడికి వెళ్లాడు. ప్రార్థనల అనంతరం దేవుణ్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆయన పాదాలపై తలపెట్టాడు.
రాజేష్ మెహానీ దేవుడి పాదాలపై తలపెట్టి అలానే ఉండిపోయాడు. సుమారు 15 నిమిషాలు అలానే ఉండిపోవటంతో అనుమానం వచ్చిన మిగిలిన భక్తులు మెహానీని లేపేందుకు ప్రయత్నించగా ఎలాంటి ఉలుకుపలుకు లేదు. దీంతో భక్తులు, దేవాలయ సిబ్బంది దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. రాజేష్ మొహానీని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు.
मध्यप्रदेश कटनी साईं मंदिर में बाबा के चरणों में टेका मत्था, फिर सिर नहीं उठा पाया युवक, हार्ट अटैक से मौत!#katni pic.twitter.com/zn3Wx1ts7Z
— manishkharya (@manishkharya1) December 4, 2022
అయితే అలా ఎందుకు చనిపోయాడనే కారణాలను పూర్తిస్థాయిలో వైద్యులు చెప్పలేకపోయినా.. గుండె నొప్పే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం వాతావరణం నెలకొంది. ఇదిలాఉంటే మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో శుక్రవారంసైతం ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఓ బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావటంతో బస్సు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిచియున్న వాహనదారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.