Woman : ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం
ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. హైదరాబాద్కు చెందిన రేసి.. మెహదీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక మగ శిశువుతో పాటు ముగ్గురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది.
woman gave birth to four children : ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. హైదరాబాద్కు చెందిన రేసి.. మెహదీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక మగ శిశువుతో పాటు ముగ్గురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లిబిడ్డల ఆరోగ్యం బాగుందని డాక్టర్లు తెలిపారు.
బుధవారం ఆస్పత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డా.సోహెబా షుకూర్ డాక్టర్ల బృందం వివరాలను వెల్లడించింది. పాతబస్తీలోని హఫీజ్ బాబానగర్ కు చెందిన రేసి అనే మహిళ ప్రసవం కోసం మంగళవారం మెహిదీపట్నంలోని మీనా ఆస్పత్రిలో చేరారని తెలిపారు.
Fish : అరుదైన చేప…కిలో రూ.13 వేలు
ఆమెకు ఒగ మగ, ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని పేర్కొన్నారు. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. మగ శిశువు 1500 గ్రాములు, ఆడ శిశువులు 1500, 1400, 1300 గ్రాముల బరువు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.