Aishwarya Rai: లతా మంగేష్కర్ కి ఐష్ నివాళి.. నెటిజన్ల ట్రోల్స్!

ఇండియన్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణవార్త భారత సినీ సంగీత ప్రియులను ఎంతగానో బాధించింది. దాదాపు ఇరవై రోజులుగా కరోనాతో పోరాడిన లతాజీ ఫిబ్రవరి 6న ఆదివారం ఉదయం తుదిశ్వాస..

Aishwarya Rai: లతా మంగేష్కర్ కి ఐష్ నివాళి.. నెటిజన్ల ట్రోల్స్!

Aishwarya Rai

Aishwarya Rai: ఇండియన్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణవార్త భారత సినీ సంగీత ప్రియులను ఎంతగానో బాధించింది. దాదాపు ఇరవై రోజులుగా కరోనాతో పోరాడిన లతాజీ ఫిబ్రవరి 6న ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు, కుటుంబ సభ్యులు ప్రకటించారు. లతాజీ మరణవార్తకి ప్రధాని నరేంద్ర మోడీ నుండి దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేయగా కొందరు లతాజీ అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. ఆమెతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Kajal Agarwal : తన అందం, శరీరంపై వచ్చిన కామెంట్లకు ఘాటుగా స్పందిస్తూ.. తల్లి పడే కష్టాన్ని చెప్పిన కాజల్

ఈ క్రమంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ కూడా లతా మంగేష్కర్ కి నివాళులు అర్పించింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ ఆమె ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఐశ్వర్యారాయ్ మీద కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే లతాజీ చనిపోయింది ఆదివారం కాగా ఐష్ నివాళులు అర్పించింది మంగళవారం. అప్పటికి ఆమె అంత్యక్రియలు కూడా పూర్తయి రెండు రోజులు గడిచిపోయింది. ఇంత ఆలస్యంగానా నివాళి అర్పించేది అంటూ నెటిజన్లు ఐష్ మీద తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Chiranjeevi : మళ్ళీ కమర్షియల్ యాడ్స్‌లోకి మెగాస్టార్??

ఏంటి ఐశ్వర్యా.. ఇప్పుడు నిద్ర లేచావా.. మీకీవార్త ఇప్పుడు తెలిసిందా.. అంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఇండస్ట్రీలోనే సీనియర్ హీరోయిన్ గా.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక బడా కుటుంబానికి కోడలైన ఐష్.. ఒక లెజండరీ సింగర్ చనిపోతే ఇంత ఆలస్యంగా రియాక్షన్ ఇస్తారా అంటూ ఆమెపై కామెంట్లతోనే విరుచుకుపడుతున్నారు. అయితే ఐశ్వర్య ఫ్యాన్స్‌ మాత్రం ఆమెను వెనకేసుకొస్తున్నారు. తను ఎక్కువగా ఫోన్‌ వాడదని.. అందువల్లే లేట్‌గా పోస్ట్‌ పెట్టి ఉండవచ్చని సపోర్ట్ చేస్తున్నారు.