Akhanda: బుల్లితెరపై అఖండ ఆగమనం.. ఎప్పుడంటే..?

నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘అఖండ’ కరోనా పాండెమిక్ తరువాత రిలీజ్ అయిన తొలి భారీ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను....

Akhanda: బుల్లితెరపై అఖండ ఆగమనం.. ఎప్పుడంటే..?

Akhand To Get World Television Premiere

Akhanda: నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘అఖండ’ కరోనా పాండెమిక్ తరువాత రిలీజ్ అయిన తొలి భారీ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తనదైన మార్క్ టేకింగ్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే అప్పుడే కరోనా పరిస్థితుల నుండి జనం బయటకు వస్తుండటంతో, ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ అఖండ చిత్ర విజయాన్ని ఏదీ కూడా అడ్డుకోలేకపోయింది. ఫలితంగా అఖండ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

Akhanda : అఖండ శత దినోత్సవ వేడుక

ఈ సినిమాలో బాలయ్య గెటప్, ఆయన చెప్పిన డైలాగ్స్, ప్రేక్షకులను కట్టిపడేశాయి. అటు వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో అద్భుతమైన విజయంగా నిలిచింది. అయితే ఈ సినిమా వెండితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఓటీటీలోనూ అదేస్థాయిలో దుమ్ములేపింది. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయగా, అభిమానులు భారీ స్థాయిలో ఈ సినిమాను వీక్షించారు. ఇక ఇప్పుడు మరోసారి అఖండ చిత్రం ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది.

Akhanda: అఖండ దండయాత్ర.. ఈరోజుల్లో కూడా వందరోజుల రేర్ ఫీట్

ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ఏప్రిల్ 10న స్టార్ మా టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. బాలయ్య డ్యుయెల్ పర్ఫార్మెన్స్, అఘోరాగా బాలయ్య పవర్ ఫుల్ డైలాగులు, థమన్ సంగీతంతో వచ్చే గూస్ బంప్స్.. ఇలా అన్ని అంశాలు మరోసారి అఖండ చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చేలా చేసేందుకు రెడీ అవుతోంది. మరి బుల్లితెరపై అఖండ ఆగమనం ఉండగా, దానికి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే ఏప్రిల్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కంచె ఫేం బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా, మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.