Sankranthi Movies : సంక్రాంతి సినిమాల ఇష్యూ మీద మాట్లాడిన అగ్ర నిర్మాతలు..

ఈ షోలో పూర్తిగా సినిమాలతో పాటు సినిమాలకి సంబంధించిన కాంట్రవర్సీల గురించి కూడా మాట్లాడారు. ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల ఇష్యూ జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడుతుండగా మధ్యలో తమిళ్ డబ్బింగ్ సినిమా.....................

Sankranthi Movies : సంక్రాంతి సినిమాల ఇష్యూ మీద మాట్లాడిన అగ్ర నిర్మాతలు..

allu aravind and suresh babu reacts on Sankranthi Movies issue

Sankranthi Movies :  ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్ లో నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా బాగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వస్తుంది.

ఇక ఈ షోలో పూర్తిగా సినిమాలతో పాటు సినిమాలకి సంబంధించిన కాంట్రవర్సీల గురించి కూడా మాట్లాడారు. ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల ఇష్యూ జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడుతుండగా మధ్యలో తమిళ్ డబ్బింగ్ సినిమా వారసుడు రానుంది. దిల్ రాజు ఈ విషయంలో తగ్గను అంటే తగ్గను అంటున్నాడు. దీంతో సినిమాలకి థియేటర్స్ ఇచ్చే విషయంపై వివాదం నడుస్తుంది.

Also Read……………..    Nepotism : నన్ను ట్రోల్ చేసినా సరే.. నెపోటిజంలో తప్పులేదు.. అల్లుఅరవింద్ వ్యాఖ్యలు..

బాలయ్య దీని గురించి అడుగుతూ నా సినిమాకి సంక్రాంతికి ఎన్ని థియేటర్స్ ఇస్తారు అని అడిగారు. దీనికి అల్లు అరవింద్, సురేష్ బాబు మాట్లాడుతూ.. సంక్రాంతికి ఇవ్వగలిగినన్ని థియేటర్స్ ఇస్తాం. అది డిస్ట్రిబ్యూటర్స్ మీద ఆధారపడి ఉంటది. అయినా సంక్రాంతికి ఏ సినిమా కలెక్ట్ చేస్తుందో, ఏ సినిమా ఆడుతుందో అందరికి తెలుసు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వాళ్ళే ఏ సినిమా కావాలో అడిగి మరీ కొనుక్కుంటారు. కాకపోతే ఈ సారి థియేటర్స్ విషయంలో కచ్చితంగా గొడవలు వస్తాయి అని అన్నారు.