Prabhas : ‘రాధేశ్యామ్’కి అమితాబ్ వాయిస్ ఓవర్.. సినిమాకి మరింత హైప్

తాజాగా 'రాధేశ్యామ్' సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. 'రాధేశ్యామ్' సినిమాకి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. దీంతో సినిమాకి హైప్ పెరగడమే కాక బాలీవుడ్ మార్కెట్ కి..........

Prabhas :  ‘రాధేశ్యామ్’కి అమితాబ్ వాయిస్ ఓవర్.. సినిమాకి మరింత హైప్

Radheshyam

Radheshyam :  ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరెక్కిన సినిమా ‘రాధేశ్యామ్’. 1980లలో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఓ లవ్ స్టోరీ, కొన్ని రియల్ అంశాలని తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకొని ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ కరోనా కారణంగా సినిమాని మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి.

తాజాగా ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ‘రాధేశ్యామ్’ సినిమాకి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. దీంతో సినిమాకి హైప్ పెరగడమే కాక బాలీవుడ్ మార్కెట్ కి మరింత ప్లస్ అవ్వనుంది. ఇప్పటికే అమితాబ్, ప్రభాస్ కలిసి ‘ప్రాజెక్టు K’ సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ నటనకి, ప్రభాస్ చేసే అతిధి మర్యాదలకి బాగా ఇంప్రెస్ అయిన అమితాబ్ ఇప్పటికే ట్విట్టర్ లో ప్రభాస్ ని పొగుడుతూ పోస్టులు చేశారు.

Abhiram : దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. రానా తమ్ముడు అభిరామ్ ఎంట్రీ

తాజాగా ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాకి వాయిస్ ఓవర్ ఇమ్మని అడగడంతో అమితాబ్ ఓకే అన్నారు. దీంతో ‘రాధేశ్యామ్’ సినిమా అమితాబ్ వాయిస్ ఓవర్ తో రానుంది. మార్చ్ 11న ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్ర బృందం. ప్రభాస్ అభిమానులు ‘రాధేశ్యామ్’ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.