Rajya Sabha Polls: ఓటు వేసేందుకు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్కు అవకాశం ఇవ్వని కోర్టు
నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వబోమని ముంబై కోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర నుంచి ఆరు సీట్లకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వాలని గత వారం నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే.
Rajya Sabha Polls: నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వబోమని ముంబై కోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర నుంచి ఆరు సీట్లకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వాలని గత వారం నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే.
Revanth Reddy: రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ చెప్పినట్లు కేసీఆర్ వింటారు: రేవంత్ రెడ్డి
దీనిపైనే నేడు కోర్టు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికలు శుక్రవారమే జరగనున్నాయి. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది ఫిబ్రవరి 23న అరెస్టు చేసింది. అలాగే, ఇటువంటి ఆరోపణలే ఎదుర్కొంటూ దేశ్ముఖ్ కూడా జైలులో ఉన్నారు.
South China Sea: వియత్నాంకు 12 హై-స్పీడ్ గార్డ్ బోట్లను అందించిన భారత్
రాజ్యసభ ఎన్నికలు జరగనున్న జూన్ 10న తనకు బెయిల్ కావాలని మాలిక్, దేశ్ముఖ్ కోరారు. అలాగే, తాను బాధ్యతగల ఓ ఎమ్మెల్యేనని, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడం తన విధి అని నవాబ్ మాలిక్ పిటిషన్లో పేర్కొన్నారు. మాలిక్, దేశ్ముఖ్ బెయిల్ అభ్యర్థనపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి కోర్టు ఇటీవలే సూచించింది. దీంతో ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. చివరకు కోర్టు నుంచి మాలిక్, దేశ్ముఖ్కు బెయిల్ దక్కలేదు.