Ashes 2021-22 : కెప్టెన్ స్టీవ్ స్మిత్ పడుకోకుండా..ఏం చేస్తున్నాడో తెలుసా ?

.అడిలైడ్ వేదికగా యాషెస్ రెండో టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ పటిష్టమైన స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్ ను 473/9 వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్డ్ చేసింది.

Ashes 2021-22 : కెప్టెన్ స్టీవ్ స్మిత్ పడుకోకుండా..ఏం చేస్తున్నాడో తెలుసా ?

Aus (1)

Steve Smith Shadow Batting : క్రికెట్ మ్యాచ్ అయిపోగానే అందరూ ఏం చేస్తారు. కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారు. మరికొంతమంది మరుసటి రోజు మ్యాచ్ ఎలా ఆడాలా అని ఆలోచించుకుంటూ పడుకుంటారు కదా. కానీ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం అలా చేయలేదు. హోటల్ రూంలో పడుకోకుండా బ్యాట్ పట్టుకున్నాడు. అర్ధరాత్రి అవుతున్నా…షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తోటి ఆటగాళ్లు ప్రశాంతంగా నిద్ర పోయినా..ఇతను మాత్రం బ్యాట్ ను చూస్తూ…ఎలా బ్యాటింగ్ చేయాలా ? దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అతని సతీమణి డాని విల్లిస్ ఇన్ స్ట్రా గ్రామ్ వేదికగా పోస్టు చేయగా …Nic Savage ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. స్టీవ్ స్మిత్ తన కొత్త బ్యాట్ ను చూస్తున్నారు అనే క్యాప్షన్ పెట్టింది. దీనిని చూస్తున్న నెటిజన్లు ఫన్నీ..ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అర్ధరాత్రి ఏం పని అంటూ కామెంట్ చేశాడు.

Read More : Mulugu Accident : రక్తమోడిన రహదారి.. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇక మ్యాచ్ విషయానికి వస్తే..అడిలైడ్ వేదికగా యాషెస్ రెండో టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ పటిష్టమైన స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్ ను 473/9 వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్డ్ చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 93 పరుగులు చేసి..జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఇంగ్లండ్ ను కేవలం 236 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగుల అధిక్యం ఆసీస్ లభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 45 పరుగులు చేసి…290 పరుగుల వద్ద ఆధిక్యంలో నిలిచింది.