Independence Day 2022: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.. ఆరు ఖండాల్లో ఎగిరిన భారత జెండా

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ఇండియన్ నేవీ ఘనంగా నిర్వహించింది. ఆరు ఖండాలు, మూడు సముద్రాల్లోని ఆరు టైమ్ జోన్లలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడి భారత యుద్ధ నౌకలపై మన జాతీయ జెండాను ఎగరవేశారు.

Independence Day 2022: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.. ఆరు ఖండాల్లో ఎగిరిన భారత జెండా

Independence Day 2022: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ఇండియన్ నేవీ ఘనంగా నిర్వహించింది. ఆరు ఖండాలు, మూడు సముద్రాల్లోని ఆరు టైమ్ జోన్లలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడి భారత యుద్ధ నౌకలపై మన జాతీయ జెండాను ఎగరవేశారు.

CM YS Jagan: స్వాతంత్ర్య పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా: ఏపీ సీఎం జగన్

ఈ కార్యక్రమాన్ని చూసేందుకు స్థానికంగా ఉంటున్న భారతీయులు భారీ ఎత్తున హాజరై దేశభక్తిని చాటుకున్నారు. ఓడరేవుల వద్ద జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కొందరు అక్కడి యుద్ధ నౌకలపైకి ఎక్కి ఫొటోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఐఎన్ఎస్ సూర్య’ అనే భారత యుద్ధనౌక సింగపూర్‌లోని ఛాంగై నౌకా స్థావరానికి చేరుకుంది. అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ తరక్ష్‌పై జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అక్కడ నావికాదళ సిబ్బంది పరేడ్ నిర్వహించారు. ఐరోపాలోని సముద్ర జలాల్లో ఉన్న ఐఎన్ఎస్ తరంగిణిపై సిబ్బంది జాతీయ పతాకాన్ని ఎగరేశారు.

PM Modi: స్వాతంత్ర్య వేడుకల్లో ఆసక్తికర దృశ్యం.. చిన్నారుల మధ్య ఉత్సాహంగా గడిపిన మోదీ

కెన్యాలోని ముంబాస పోర్టుకు ఐఎన్ఎస్ తబర్ చేరుకోగా, అక్కడ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ నౌకాశ్రయంలో భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ సుమేధపై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం సాగింది. అమెరికాలోని శాన్ డియాగో పోర్టులో కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరిగింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాల్ని భారత నావికా దళం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.