Bengaluru : డేటిండ్ యాప్ ఆమె కొంప ముంచింది.. రూ.4.5 లక్షలు మోసగాడు స్వాహా..
ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. పుట్టగొడుగుల్లా వెలిసిన డేటింగ్ యాప్స్ అమాయకుల్ని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడని నమ్మి బెంగళూరులో ఓ మహిళ లక్షలు పోగొట్టుకుంది.
Bengaluru woman cheated by dating app : ముఖ పరిచయం ఉన్నవారితో ప్రేమలే బెడిసి కొడుతున్నాయి. ఇక డేటింగ్ యాప్లలో పరిచయం అయినవారితో ప్రేమ అంటే కాస్త ఆలోచించాలి కదా.. బెంగళూరులో ఓ మహిళ తన డబ్బులు పోగొట్టుకునేదాకా మోసపోయానని తెలుసుకోలేకపోయింది.
Bengaluru : బస్సులోనే లంచ్ కంప్లీట్ చేస్తున్న డ్రైవర్.. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మామూలుగా లేవు
ఇటీవల కాలంలో డేటింగ్ యాప్లు జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. తాము కోల్పోయినదేదో అక్కడ దొరుకుతుందన్నట్లు జనాలు వాటిని నమ్ముతున్నారు. ఇదే అదనుగా స్కామర్లు చెలరేగిపోతున్నారు. బెంగళూరుకి చెందిన ఓ మహిళ డేటింగ్ యాప్లో పరిచయం అయిన వ్యక్తి వల్ల లక్షలు పోగొట్టుకుంది. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న 37 సంవత్సరాల మహిళకు టిండర్ యాప్లో అద్విక్ చోప్రా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను UK లో డాక్టర్గా పనిచేస్తున్నట్లు ఆమెను నమ్మించాడు. ఒక నెలరోజులు పరిచయంలో బాగా క్లోజ్ అయిన ఇద్దరు బెంగళూరులో కలవాలని కూడా అనుకున్నారు.
ఈలోపు ఒకరోజు ఆమెకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. చోప్రాని పోలీసులు అరెస్టు చేశారని.. అతనిని విడుదల చేయాలంటే రూ.68,000 కట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఫీజు కింద రూ.1.8 లక్షలు, ప్రాసెసింగ్ ఛార్జీలుగా రూ.2.06 లక్షలు ఇవ్వాలని కోరారట. చోప్రాను కలవాలనే ఆత్రంలో ఆ మహిళ ఒక్క క్షణం ఆలోచించకుండా మొత్తంగా 4.5 లక్షల డబ్బును వారికి ట్రాన్స్ ఫర్ చేసింది.
jail restaurant : బెంగళూరులో జైలును పోలిన రెస్టారెంట్ వీడియో వైరల్
మోసగాడు మళ్లీ అదనంగా రూ.6 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు చోప్రాతో ఆమె కాంటాక్ట్ కోల్పోయింది. దాంతో అద్విక్ చోప్రా అనే ఫేక్ ఐడెంటిటీతో స్కామర్ వల్ల తాను మోసపోయానని తెలుసుకుంది. చోప్రా తనను కలవడానికి లండన్ నుంచి వచ్చినట్లు నమ్మానని మహిళ పోలీసులకు చెప్పింది. అతను నిజంగా ఏదో ప్రమాదంలో ఉన్నాడనుకుని డబ్బులు చెల్లించినట్లు వాపోయింది. ఇక చేసేదేముంది? పోలీసులు దొంగను పట్టుకోగలిగేవరకు ఆమె వెయిట్ చేయడం తప్ప.