maharashtra: మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్‌కు క‌రోనా నిర్ధార‌ణ‌

maharashtra: మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్‌కు క‌రోనా నిర్ధార‌ణ‌

maharashtra: మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉంటూ వైద్యుడి సూచ‌న‌ల మేర‌కు చికిత్స తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. క‌రోనా కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న చెప్పారు.

devineni uma: ‘సీఎఫ్ఎంఎస్‌లో పేమెంట్ల విధానంపై విచారణ జరిపితే జగన్ జైలుకెళ్లడం ఖాయం’

కాగా, ఫ‌డ్న‌వీస్‌కు 2020 అక్టోబ‌రులోనూ కరోనా సోకింది. అప్ప‌ట్లో ఆయ‌న ఓ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. కాగా, మ‌హారాష్ట్రలో కొన్ని రోజులుగా క‌రోనా కేసులు పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ముంబైలో క‌రోనా విజృంభిస్తోంది. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లు అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు వాడాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సూచించింది.