Bollywood : టాలీవుడ్ వాళ్ళకి కరణ్ జోహార్.. బాలీవుడ్ వాళ్లకి రాజమౌళి.. బ్రహ్మాస్త్రతో క్లారిటీ వచ్చిందా??

మన తెలుగు స్టార్స్, డైరెక్టర్స్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొడుతున్నారు. బాలీవుడ్ వాళ్లు మాత్రం తామేం తక్కువ తిన్నాం అనుకున్నారో ఏమో కాని, సౌత్ మార్కెట్ పైన...........

Bollywood : టాలీవుడ్ వాళ్ళకి కరణ్ జోహార్.. బాలీవుడ్ వాళ్లకి రాజమౌళి.. బ్రహ్మాస్త్రతో క్లారిటీ వచ్చిందా??

Karan Rajamouli

Tollywood :  మన తెలుగు స్టార్స్, డైరెక్టర్స్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొడుతున్నారు. బాలీవుడ్ వాళ్లు మాత్రం తామేం తక్కువ తిన్నాం అనుకున్నారో ఏమో కాని, సౌత్ మార్కెట్ పైన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తున్నారు. మనవాళ్లు కరణ్ జోహార్ ను పట్టుకుంటే, వాళ్లు ఏకంగా రాజమౌళినే లైన్ లో పెట్టి ఇక్కడా ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు.

ఇప్పుడు ఇండియన్ సినిమాల బిజినెస్ కు తెలుగు మార్కెట్ కీలకంగా మారింది. అందుకే కరణ్ జోహార్ తెలుగు సినిమాలపై కన్నేసి ఇక్కడి సినిమాలని అక్కడ ప్రమోట్ చేస్తున్నాడు. మన వాళ్ళు కూడా బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ ని పట్టుకుంటే బాలీవుడ్ లో పాగా వేసేయొచ్చు అని కనిపెట్టి అందరూ అదే చేస్తున్నారు. మొన్న RRR కోసం చరణ్, ఎన్టీఆర్ ఇప్పుడు లైగర్ కోసం విజయ్ కరణ్ తో జత కట్టి బాలీవుడ్ లో పాగా వేస్తున్నారు. దీంతో బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్ లో పాగా వేయడానికి ట్రై చేస్తున్నాయి.

తెలుగు స్టార్స్, డైరెక్టర్స్ కరణ్ జోహార్ కాంటాక్ట్ తో మన సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర చేసి, బి టౌన్ మార్కెట్లో పాగా వేసినట్టే బాలీవుడ్ కూడా టి టౌన్ మార్కెట్ పైన కన్నేసింది. బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగు ఆడియన్స్ కు రీచ్ చేయడం కోసం టాలీవుడ్ జక్కన్నను కన్సల్ట్ చేశారు బ్రహ్మాస్త్ర వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. రాజమౌళి ముందుండి ఇప్పటి నుంచే ఈ సినిమాకు భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆడియన్స్ లో ఆసక్తిని కలిగిస్తున్నారు. మొన్న హైదరాబాద్ లో రాజమౌళితో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. లేటెస్ట్ గా వైజాగ్ లో బైక్ ర్యాలీ చేసి, రణబీర్, రాజమౌళి కలిసి గ్రాండ్ గా ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ వేదిక నుంచి సినిమా కొత్త టీజర్ రిలీజ్ చేశారు. ట్రయిలర్ జూన్ 15న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

Pooja Hegde : తిరుగులేని బుట్టబొమ్మ.. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు..

అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు అమితాబచ్చన్. అక్కినేని నాగార్జున కూడా మరో కీ రోల్ పోషిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా బి టౌన్ లోనే కాదు, సౌత్ మార్కెట్ పైనా గంపెడు ఆశలు పెట్టుకుంది. మరి రాజమౌళి సమర్పణలో తెలుగులో రిలీజ్ అవుతున్నఈ సినిమా ఇక్కడి ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. మొత్తానికి బాలీవుడ్ వాళ్ళు రాజమౌళిని పట్టుకొని టాలీవుడ్ లో పాగా వేయాలని ఫిక్స్ అయిపోయారు.