Car Accident : చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఎనిమిది మంది మృతి
బిహార్ పూర్ణియా జిల్లాలోని కంజియా గ్రామంలో ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ స్కార్పియో వాహనం..చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. గా ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
Car Accident In Bhihar : బిహార్ పూర్ణియా జిల్లాలోని కంజియా గ్రామంలో ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ స్కార్పియో వాహనం..చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. గా ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
తారాబడి నుంచి కిషన్ గంజ్ వెళ్తుండగా రౌటా పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్ని కిశన్గంజ్లోని నునియా గ్రామస్థులుగా గుర్తించారు. తారాబడి ప్రాంతంలో జరిగిన ఓ ముందస్తు వివాహ కార్యక్రమానికి హాజరైన బాధితులు.. తిరిగి ప్రయాణమవుతుండగా శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం?.. భారీ శబ్దం విన్న స్థానికులు ప్రమాదస్థలికి చేరుకుని కారులో ఉన్న మృతదేహాల్ని బయటకు తీశారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, సీఓ ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి సమాచారం సేకరించారు. మృతుల బంధువులు సైతం ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. వాహనం అతివేగంగా నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.