Telangana : జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు తెలుస్తోంది. టూర్‌లో అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నారు సీఎం.

Telangana : జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్

Kcr Tour

CM KCR Tour : సీఎం కేసీఆర్ త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు తెలుస్తోంది. టూర్‌లో అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నారు సీఎం. ఇందుకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రసంగాలు ఉండనున్నాయి. అంతేకాకుండా ప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా… వారి విమర్శలను దీటుగా తిప్పి కొట్టనున్నారు సీఎం కేసీఆర్.

Read More : Singapore : అతడిని ఉరి తీయొద్దు…ఆన్ లైన్ ఉద్యమం, మరీ ప్రభుత్వం ఏ చేస్తుంది ?

గత కొన్ని రోజులు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రతి అంశలోనూ టార్గెట్‌ చేస్తున్నాయి. వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ సరైన విధంగా సమాధానం చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. నెల 29న వరంగల్‌లో టీఆర్ఎస్ పార్టీ విజయ గర్జన సభ జరగనుంది. ఆ సభలోపు 1, 2 జిల్లాల్లో సిఎం కేసిఆర్ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వరుసగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. వాటి అమలు తీరుతెన్నులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. తద్వారా ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం జరుగుతుందంటున్నాయి ఆ ఆపార్టీ శ్రేణులు.